Botsa Satyanarayana : బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..!
Botsa Satyanarayana : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స కిందపడిపోవడంతో అక్కడి నేతలు, కార్యకర్తల్లో కలకలం రేగింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన వడదెబ్బకు గురై ఇలా జరిగినట్టు తెలుస్తోంది.
Botsa Satyanarayana : బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..!
ఈ సంఘటనకు ముందు చీపురుపల్లిలోని కొత్త పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ, మూడురోడ్ల జంక్షన్ వరకు సుమారు కిలోమీటరన్నర పాటు సాగింది. ఎండ తీవ్రతను లెక్కచేయకుండా కాలినడకన బొత్స పాల్గొనడంతో శరీరానికి అధిక ఉష్ణోగ్రతగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. అనంతరం జరిగిన సభలో వాహనంపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పార్టీ శ్రేణులు వేగంగా స్పందించి హాస్పటల్కు తరలించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
వైఎస్సార్సీపీ ఈ కార్యక్రమాన్ని ఏపీ కూటమి ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నిర్వహించింది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, “వెన్నుపోటు దినం”గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంలో బొత్స సత్యనారాయణకు జరిగిన సంఘటనతో కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైనా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
This website uses cookies.