Roja : ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే చర్చ. ఏపీ, తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్ అంశం తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. వైసీపీ నేతలు చాలామంది కూడా చంద్రబాబు అరెస్ట్ ను సంబురాలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతుంటే వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండింది అంటున్నారు. ఇక.. ఎప్పుడూ చంద్రబాబుపై సీరియస్ అయ్యే ఏపీ మంత్రి ఆర్కే రోజా తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆమె తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష వేయాలి. చంద్రబాబు అయినా ఇంకెవరు అయినా.. ప్రజల డబ్బును దోచుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది చంద్రబాబుకు తెలియాలి. కరెక్ట్ గా ఈరోజు చంద్రబాబు సాక్షాధారాలతో అడ్డంగా దొరికారు. ఆయనకు స్నేహా బ్యారక్ లో చక్కటి గది ఇచ్చారు. మంచి నెంబర్ కూడా ఇచ్చారు. సీసీ కెమెరాలు పెట్టారు. కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు, అచ్చెన్నాయుడు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ల ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో జనాలకు అర్థం కావడం లేదు.. అని రోజా అన్నారు.
అది అక్రమ కేసు అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన కేసు అది. చదువుకున్న యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ట్రెయినింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో పెద్ద స్కామ్ కు తెరలేపి అడ్డంగా డబ్బులు దోచుకున్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసు అవుతుందా? బాబు వస్తేనే జాబు వస్తుంది అంటూ చెప్పి 2014 లో అధికారంలోకి వచ్చి అనేక స్కామ్ లకు తెరలేపి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో యువత గమనించాలి. 2024 లో టీడీపీకి బుద్ధి చెప్పాలి. జగన్ సీఎం కాగానే 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ ఉద్యోగాలు.. ఇలా యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించారు సీఎం జగన్. చంద్రబాబు మాత్రం తన బిడ్డ బాగుంటే చాలు అనుకున్నాడు.. అంటూ రోజా ఫైర్ అయ్యారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.