
MP Bharath : దమ్ముంటే రాజమండ్రిలో నాతో పోటీ చేయ్.. నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ ..!
MP Bharath : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసి కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చిన నేను ఒక్కడినే చర్చకు వస్తా చంద్రబాబుకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని అయినా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం నాలుగోవంతైన చేసావా అని చంద్రబాబును ఉద్దేశించి భారత్ ప్రశ్నించారు.
పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేసానని చెప్పుకోవడం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేసావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. పందికొక్కులా మెక్కేసి నీతిపరుల్లా ఫోజులా అని వ్యాఖ్యానించారు. నేను ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం 400 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చాను. ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది అనేది ప్రధానం. పార్లమెంటులో నేను మాట్లాడినట్టుగా నీ పార్టీ ఎంపీలు గత పది సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్పు. రాష్ట్ర జాతీయ సమస్యలపై లోక్ సభలో ఎక్కువగా మాట్లాడింది నేనే అని, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి నువ్వు కాకపోతే నీ కొడుకు లోకేష్ అయినా ఇక్కడికి పంపి నన్ను ఓడించు అని భరత్ సవాల్ విసిరారు. నేను చేసిన డెవలప్మెంట్ ను నారా లోకేష్ 50% అయినా చేస్తాడా అని తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సబ్జెక్టు ఉందని అతడి వల్ల అయినా పార్టీ బ్రతుకుతుందని, నీ పప్పుసుద్ద లోకేష్ ను పెట్టుకుంటే పార్టీ లేవదు అని ఎద్దేవా చేశారు.
ఆవ భూములలో 150 కోట్లు కొట్టేసానని వర్కులో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్కదాంట్లో అయినా నిరూపించగలరని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించిన రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డుపెట్టుకొని సంపాదించాలని ఆలోచన నీకు లేదన్నారు. రాజమండ్రి నగరం జేఎన్ రోడ్డులో గల పార్కును మహా నాయకుడు ఏకేసి పేరు పెడితే దానిని ఎన్టీఆర్ పార్టుగా 2015లో తీర్మానం చేసేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము తీర్మానిస్తున్నాం. ఈ పార్కుకు గతంలో ఏ పేరు అయితే ఉందో ఏకేసి పార్కు అలాగే ఉండాలని ఈ విషయమై కలెక్టర్ కమిషనర్ కు పంపిస్తామని అన్నారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.