MP Bharath : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసి కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చిన నేను ఒక్కడినే చర్చకు వస్తా చంద్రబాబుకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని అయినా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం నాలుగోవంతైన చేసావా అని చంద్రబాబును ఉద్దేశించి భారత్ ప్రశ్నించారు.
పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేసానని చెప్పుకోవడం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేసావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. పందికొక్కులా మెక్కేసి నీతిపరుల్లా ఫోజులా అని వ్యాఖ్యానించారు. నేను ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం 400 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చాను. ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది అనేది ప్రధానం. పార్లమెంటులో నేను మాట్లాడినట్టుగా నీ పార్టీ ఎంపీలు గత పది సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్పు. రాష్ట్ర జాతీయ సమస్యలపై లోక్ సభలో ఎక్కువగా మాట్లాడింది నేనే అని, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి నువ్వు కాకపోతే నీ కొడుకు లోకేష్ అయినా ఇక్కడికి పంపి నన్ను ఓడించు అని భరత్ సవాల్ విసిరారు. నేను చేసిన డెవలప్మెంట్ ను నారా లోకేష్ 50% అయినా చేస్తాడా అని తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సబ్జెక్టు ఉందని అతడి వల్ల అయినా పార్టీ బ్రతుకుతుందని, నీ పప్పుసుద్ద లోకేష్ ను పెట్టుకుంటే పార్టీ లేవదు అని ఎద్దేవా చేశారు.
ఆవ భూములలో 150 కోట్లు కొట్టేసానని వర్కులో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్కదాంట్లో అయినా నిరూపించగలరని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించిన రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డుపెట్టుకొని సంపాదించాలని ఆలోచన నీకు లేదన్నారు. రాజమండ్రి నగరం జేఎన్ రోడ్డులో గల పార్కును మహా నాయకుడు ఏకేసి పేరు పెడితే దానిని ఎన్టీఆర్ పార్టుగా 2015లో తీర్మానం చేసేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము తీర్మానిస్తున్నాం. ఈ పార్కుకు గతంలో ఏ పేరు అయితే ఉందో ఏకేసి పార్కు అలాగే ఉండాలని ఈ విషయమై కలెక్టర్ కమిషనర్ కు పంపిస్తామని అన్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.