
MP Bharath : దమ్ముంటే రాజమండ్రిలో నాతో పోటీ చేయ్.. నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ ..!
MP Bharath : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసి కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చిన నేను ఒక్కడినే చర్చకు వస్తా చంద్రబాబుకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని అయినా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం నాలుగోవంతైన చేసావా అని చంద్రబాబును ఉద్దేశించి భారత్ ప్రశ్నించారు.
పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేసానని చెప్పుకోవడం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేసావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. పందికొక్కులా మెక్కేసి నీతిపరుల్లా ఫోజులా అని వ్యాఖ్యానించారు. నేను ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం 400 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చాను. ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది అనేది ప్రధానం. పార్లమెంటులో నేను మాట్లాడినట్టుగా నీ పార్టీ ఎంపీలు గత పది సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్పు. రాష్ట్ర జాతీయ సమస్యలపై లోక్ సభలో ఎక్కువగా మాట్లాడింది నేనే అని, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి నువ్వు కాకపోతే నీ కొడుకు లోకేష్ అయినా ఇక్కడికి పంపి నన్ను ఓడించు అని భరత్ సవాల్ విసిరారు. నేను చేసిన డెవలప్మెంట్ ను నారా లోకేష్ 50% అయినా చేస్తాడా అని తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సబ్జెక్టు ఉందని అతడి వల్ల అయినా పార్టీ బ్రతుకుతుందని, నీ పప్పుసుద్ద లోకేష్ ను పెట్టుకుంటే పార్టీ లేవదు అని ఎద్దేవా చేశారు.
ఆవ భూములలో 150 కోట్లు కొట్టేసానని వర్కులో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్కదాంట్లో అయినా నిరూపించగలరని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించిన రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డుపెట్టుకొని సంపాదించాలని ఆలోచన నీకు లేదన్నారు. రాజమండ్రి నగరం జేఎన్ రోడ్డులో గల పార్కును మహా నాయకుడు ఏకేసి పేరు పెడితే దానిని ఎన్టీఆర్ పార్టుగా 2015లో తీర్మానం చేసేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము తీర్మానిస్తున్నాం. ఈ పార్కుకు గతంలో ఏ పేరు అయితే ఉందో ఏకేసి పార్కు అలాగే ఉండాలని ఈ విషయమై కలెక్టర్ కమిషనర్ కు పంపిస్తామని అన్నారు.
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
This website uses cookies.