MP Bharath : దమ్ముంటే రాజమండ్రిలో నాతో పోటీ చేయ్.. నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ ..!

Advertisement
Advertisement

MP Bharath : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసి కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చిన నేను ఒక్కడినే చర్చకు వస్తా చంద్రబాబుకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని అయినా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం నాలుగోవంతైన చేసావా అని చంద్రబాబును ఉద్దేశించి భారత్ ప్రశ్నించారు.

Advertisement

పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేసానని చెప్పుకోవడం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేసావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. పందికొక్కులా మెక్కేసి నీతిపరుల్లా ఫోజులా అని వ్యాఖ్యానించారు. నేను ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం 400 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చాను. ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది అనేది ప్రధానం. పార్లమెంటులో నేను మాట్లాడినట్టుగా నీ పార్టీ ఎంపీలు గత పది సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్పు. రాష్ట్ర జాతీయ సమస్యలపై లోక్ సభలో ఎక్కువగా మాట్లాడింది నేనే అని, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి నువ్వు కాకపోతే నీ కొడుకు లోకేష్ అయినా ఇక్కడికి పంపి నన్ను ఓడించు అని భరత్ సవాల్ విసిరారు. నేను చేసిన డెవలప్మెంట్ ను నారా లోకేష్ 50% అయినా చేస్తాడా అని తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సబ్జెక్టు ఉందని అతడి వల్ల అయినా పార్టీ బ్రతుకుతుందని, నీ పప్పుసుద్ద లోకేష్ ను పెట్టుకుంటే పార్టీ లేవదు అని ఎద్దేవా చేశారు.

Advertisement

ఆవ భూములలో 150 కోట్లు కొట్టేసానని వర్కులో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్కదాంట్లో అయినా నిరూపించగలరని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించిన రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డుపెట్టుకొని సంపాదించాలని ఆలోచన నీకు లేదన్నారు. రాజమండ్రి నగరం జేఎన్ రోడ్డులో గల పార్కును మహా నాయకుడు ఏకేసి పేరు పెడితే దానిని ఎన్టీఆర్ పార్టుగా 2015లో తీర్మానం చేసేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము తీర్మానిస్తున్నాం. ఈ పార్కుకు గతంలో ఏ పేరు అయితే ఉందో ఏకేసి పార్కు అలాగే ఉండాలని ఈ విషయమై కలెక్టర్ కమిషనర్ కు పంపిస్తామని అన్నారు.

Advertisement

Recent Posts

Kalyan – Thanuja : కళ్యాణ్ – తనూజ మళ్ళీ ప్రేమ చిగురిస్తోంది ?? ప్రూఫ్ ఇదే !

Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…

3 minutes ago

Sreeja : కాబోయే భర్త గురించి ఓపెన్ గా చెప్పేసిన దమ్ము శ్రీజ..!

Sreeja  : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…

43 minutes ago

Ysrcp : వైసీపీ లోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టాప్ లీడర్ ?

Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…

1 hour ago

Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించ‌నున్న‌ జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?

Ys Jagan  : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…

4 hours ago

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…

5 hours ago

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌…

6 hours ago

Telangana Municipal Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!

Telangana Municipal Results 2026  : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…

7 hours ago

AP Govt Good News : కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…

7 hours ago