
Mudragada Padmanabham : కాపులు ఎవ్వరు చంద్రబాబును నమ్మొద్దు... ముద్రగడ పద్మనాభం..
Mudragada Padmanabham : ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతస్థాయిలో ప్రచారాలను చేపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోని ఏపీ ఎన్నికల్లో కాపు అధ్యక్షులు ముద్రగడ పద్మనాభం టాప్ గేర్ వేశారు. కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కాపులకు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి ఆయన నోరు విప్పారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చానియాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే కాపులు మరోసారి చంద్రబాబును నమ్మినట్లయితే నట్టేట మునిగినట్లే అంటూ ఉభయగోదావరి జిల్లాల్లో వినూత్న ప్రచారాలకు ముద్రగడ పద్మనాభం శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈస్ట్ వెస్ట్ లో ప్రతి ఇంటికి వెళ్లి కాపు సోదరులను ముద్రగడ్డ కలుస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ గా చెప్పుకుంటూ వస్తున్న బాబు మొదటినుండి కూడా కాపులను మోసం చేస్తూనే ఉన్నారని ముద్రగడ తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు కూటమిని నమ్మి గెలిపిస్తే మరోసారి కాపులు మోసపోతారని ఇకనైనా కాపు నేతలు ఓటర్లు మేలుకోవాలని చంద్రబాబును అస్సలు నమ్మొద్దని హితోవ చెబుతున్నారు.
మరో నాలుగు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను చూసి, చంద్రబాబును నమ్మి ఓటు వేస్తే గెలిచిన తర్వాత ప్రజలే తనని గెలిపించారని కాపులను చంద్రబాబు కరివేపాకుల చూస్తారని ముద్రగడ పద్మనాభం ప్రజలందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నారు. అంతెందుకు 2014లో గెలిచిన తర్వాత పొత్తుపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ ఏం చెప్పారు అనే విషయాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ మీతో పొత్తు పెట్టుకోకపోతే నాకు మరో 10 సీట్లు ఎక్కువ వచ్చేవని చంద్రబాబు అన్న మాటలు గుర్తు చేశారు. ఇది చంద్రబాబు అసలు స్వరూపమని అలాంటి చంద్రబాబును నమ్మి మళ్ళీ ఓటు వేస్తే గెలిచిన తర్వాత మనకు మట్టే మిగులుతుందని ముద్రగడ పద్మనాభం హిత బోధ చేస్తున్నారు. అందుకే ఈసారి చంద్రబాబును ఓడించమని 2029లో 50 స్థానాల్లో గెలిచి పవర్ షేరింగ్ తీసుకుందామని చెబుతున్నారు. ఇది పక్కా అంటూ ముద్రగడ్డ తెలియజేశారు.
Mudragada Padmanabham : కాపులు ఎవ్వరు చంద్రబాబును నమ్మొద్దు… ముద్రగడ పద్మనాభం..
ఇక ఇప్పుడు చంద్రబాబుకు ఓటేస్తే 2029లో మనకు కనీసం 20 సీట్లు కూడా ఇవ్వడని ప్రతి కాపు సోదరుని కలిసి ముద్రగడ పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బాబు చేతుల్లో మోసపోతామంటూ తెలియజేస్తున్నారు. కాపుల ఓట్లతో గెలిచి తర్వాత హ్యాండ్ ఇవ్వడంలో ఆయనను మించిన వారు లేరని ముద్రగడ ప్రచారాలు చేస్తున్నారు. అందుకే కాపు సోదరులు అందరూ ఆలోచించాలని ఆచితూచి ఓటు వేయాలని సూచిస్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభ చేపడుతున్న ఈ సరికొత్త ప్రచారాలు కూటమికి ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తాయో చూడాలి మరి.
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
This website uses cookies.