nimmagadda ramesh : ఏపీలో పంచాయితీ పోరులో వైకాపా ఘన విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీకి కలిసి వస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాని పరిస్థితి చూస్తుంటే మొత్తం మారిపోయింది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఊహించిన దాని కంటే కూడా ఘోరమైన పరాభవంను తమ పార్టీ అభ్యర్థులు చవి చూస్తున్నారు. కనీసం 30 నుండి 35 శాతం పంచాయితీలను తెలుగు దేశం పార్టీ దక్కించుకుంటుంది అంటూ టీడీపీ భావించినా కూడా 10 శాతంకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైకాపా నాయకులు మోహరించి పంచాయితీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కి ఈ పరిస్థితి రావడానికి కారణం నిమ్మగడ్డ అంటున్నారు.
నిమ్మగడ్డ రమేష్ పంచాయితీ ఎన్నికలు నిర్వహించి తీరుతాను అంటూ వైకాపాకు ఇష్టం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కోర్టుకు వెళ్లినా కూడా నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో వైకాపా నాయకులు నిమ్మగడ్డ రమేష్ పై పగ పెంచుకున్నారు. ఆ కోపంను ఎన్నికల సందర్బంగా చూపించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు సూచించారు. నిమ్మగడ్డ రమేష్ ను దెబ్బ తీసే విధంగా ఆయన మద్దతుగా నిలుస్తున్న టీడీపీకి షాక్ ఇచ్చేలా పంచాయితీ ఫలితాలు ఉండాలని వైకాపా నాయకులు బలంగా కోరుకున్నారు. అందుకే ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు కూడా రంగంలోకి దిగి పంచాయితీ పోరును దగ్గరుండి పరిశీలించారు. తమ వారు గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు.
వైకాపా రాజకీయం పంచాయితీల్లో పని చేసింది. ఒక వైపు అభివృద్ది కోసం వైఎస్ జగన్ పనులు మొదలు పెడుతు ఉంటే మరో వైపు తెలుగు దేశం పార్టీ ఎన్నికలు కావాల్సిందే అంటూ పట్టు బట్టి నిమ్మగడ్డతో నోటిఫికేషన్ ఇప్పించారు అంటూ గ్రామాల్లో ప్రచారం చేశారు. తాము రేషన్ వాహనాలను తీసుకు వస్తే వాటిని తెలుగు దేశం పార్టీ నాయకులు బయటకు వెళ్ల కుండా చేశారు. ఇలా రకరకాలుగా గ్రామాల్లో వైకాపా నాయకులు టీడీపీపై ప్రచారం చేయడంతో వారిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే మెజార్టీ పంచాయితీలు వైకాపా వశం అయ్యాయి అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.