nimmagadda ramesh
nimmagadda ramesh : ఏపీలో పంచాయితీ పోరులో వైకాపా ఘన విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీకి కలిసి వస్తుందనే నమ్మకంను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాని పరిస్థితి చూస్తుంటే మొత్తం మారిపోయింది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఊహించిన దాని కంటే కూడా ఘోరమైన పరాభవంను తమ పార్టీ అభ్యర్థులు చవి చూస్తున్నారు. కనీసం 30 నుండి 35 శాతం పంచాయితీలను తెలుగు దేశం పార్టీ దక్కించుకుంటుంది అంటూ టీడీపీ భావించినా కూడా 10 శాతంకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైకాపా నాయకులు మోహరించి పంచాయితీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కి ఈ పరిస్థితి రావడానికి కారణం నిమ్మగడ్డ అంటున్నారు.
nimmagadda ramesh is the reason for ysrcp win in panchayathi elections
నిమ్మగడ్డ రమేష్ పంచాయితీ ఎన్నికలు నిర్వహించి తీరుతాను అంటూ వైకాపాకు ఇష్టం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కోర్టుకు వెళ్లినా కూడా నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో వైకాపా నాయకులు నిమ్మగడ్డ రమేష్ పై పగ పెంచుకున్నారు. ఆ కోపంను ఎన్నికల సందర్బంగా చూపించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు సూచించారు. నిమ్మగడ్డ రమేష్ ను దెబ్బ తీసే విధంగా ఆయన మద్దతుగా నిలుస్తున్న టీడీపీకి షాక్ ఇచ్చేలా పంచాయితీ ఫలితాలు ఉండాలని వైకాపా నాయకులు బలంగా కోరుకున్నారు. అందుకే ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు కూడా రంగంలోకి దిగి పంచాయితీ పోరును దగ్గరుండి పరిశీలించారు. తమ వారు గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు.
వైకాపా రాజకీయం పంచాయితీల్లో పని చేసింది. ఒక వైపు అభివృద్ది కోసం వైఎస్ జగన్ పనులు మొదలు పెడుతు ఉంటే మరో వైపు తెలుగు దేశం పార్టీ ఎన్నికలు కావాల్సిందే అంటూ పట్టు బట్టి నిమ్మగడ్డతో నోటిఫికేషన్ ఇప్పించారు అంటూ గ్రామాల్లో ప్రచారం చేశారు. తాము రేషన్ వాహనాలను తీసుకు వస్తే వాటిని తెలుగు దేశం పార్టీ నాయకులు బయటకు వెళ్ల కుండా చేశారు. ఇలా రకరకాలుగా గ్రామాల్లో వైకాపా నాయకులు టీడీపీపై ప్రచారం చేయడంతో వారిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే మెజార్టీ పంచాయితీలు వైకాపా వశం అయ్యాయి అంటున్నారు.
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
This website uses cookies.