Y.S.Jaganmohan reddy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో వంద రోజుల్లో జరగనున్నాయి. శాసనసభ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైయస్సార్ సీపీ అధినేత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తూ, ట్రాన్స్ఫర్ చేస్తూ కొత్త ఇన్చార్జిలను నియమించే పనిలో ఉన్నారు. ఇక జనసేన , టీడీపీ సీట్ల సర్దుబాటు విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి. అయితే ఈసారి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గా పెట్టుకున్నారు.
ఈనెల 25న విశాఖ జిల్లా భీమునిపట్నం వస్తున్నారు. ఐదు జిల్లాల రీజనల్ స్థాయి వైసీపీ మీటింగ్ ని అక్కడ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో చూసుకున్న ఈసారి ఉత్తరాంధ్ర అత్యంత కీలకంగా కానుంది. వైసీపీ రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో బలంగా ఉంది. గోదావరి జిల్లా రాజకీయంలో టీడీపీ, జనసేన కూటమి ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. కృష్ణా, గుంటూరు హోరాహోరి జరగనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఏపీలో అధికారానికి రాచబాట వేయనున్నాయని అంటున్నారు. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ ఇదే ముఖ్యమంత్రి సీటు అన్నది రాజకీయంగా ఉన్న విశ్లేషణ. ఈ నేపథ్యంగా చూసుకున్నప్పుడు జగన్ అందరికంటే ముందే అలర్ట్ అవుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ హవా మరోసారి చాటి చెప్పడానికి వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించింది. బీసీలు ఎక్కువగా ఉండడంతో పాటు వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ మరోసారి కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి వైసీపీ ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక శాతం సీట్లను బీసీలకు ఇస్తుంది. నాలుగు ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వడం ఒక రికార్డుగా చెప్పాల్సి ఉంటుంది. దాంతో మరోసారి వైసీపీ గెలిచేందుకు ఎంతో దోహదపడుతుందని ఆ పార్టీ అంచనా. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినా విపక్ష తెలుగుదేశం దానికి ఒప్పుకోకపోవడం మీద కూడా వైసీపీ ఉత్తరాంధ్రలోనే తెల్చుకోవాలని చూస్తుంది. టీడీపీ ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదని, లెక్కల సాక్షిగా కూడా రుజువు చేయబోతుంది. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ వ్యూహాలను పదును పెడుతుంది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.