Dullipalla Narendra
Dhulipalla narendra : చంద్రబాబునాయుడుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బురదజల్లడం మానుకోవాలని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా?. జంగిల్ రాజ్ గా రాష్ట్రాన్ని మార్చారు.
దళితుల భూములను, ఇళ్ల పట్టాలకు, బినామీ కంపెనీలకు ధారాదత్తం చేయడంపై మాట్లాడే దమ్ము ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉందా?. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీ ఎదుట తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మీద అనేక విమర్శలు చేశారు. విమర్శలు చేసే ముందు వారి గురించి ఆత్మావలోకనం చేసుకోవాలి. జీవో నెంబర్ 41..ని ఉదహరిస్తూ ఫిర్యాదు చేశారు. 17.2.2016 వ తేదిన చేసిన జీవో. రాష్ట్ర రాజధానిని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం, భూ సమీకరణ కోసం ఇచ్చిన జీవో. ఈ జీవోతో దళితులకు అన్యాయం జరిగిందనడంలో అర్థంలేదు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంగబలం, అర్దబలం కలిగిన వ్యక్తి. అన్యాయం జరిగి ఉంటే ఇన్నాళ్లు ఊరుకుండే వ్యక్తి కాదు. సుప్రీం కోర్టులో కేసులు వేసిన ఘనమైన చరిత్ర ఆయనకుంది. జీవో ఇచ్చేటప్పుడు ఎందుకు నోరు మెదపలేదు. ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీవోపై ఇన్నాళ్లు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటంలో అర్థంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైంది. కొత్తగా ఎమ్మెల్యే అయినట్లు, ఈ జీవో గురించి ఏమీ తెలియనట్లు మాట్లాడున్నారు.
దళితుల హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా దళితులపై ప్రేమ లేదు. ఆయన ధరించిన ముసుగు గురించి అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడును అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.ఇన్నాళ్లు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడంలో పెద్ద కుట్ర ఉంది. ఇన్నాళ్లు గుర్తుకు రాని దళితులు ఇప్పడు ఎలా గుర్తుకు వచ్చారు?
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. జగన్ పై ఉన్న కేసులకు సహకరిస్తూ సజావుగా ఎంక్వైరీలు జరిపితే ప్రజా ధనం వృధా కాకుండా ఉంటుంది. గురిగింజ సామెత జగన్ కు బాగా వర్తిస్తుంది. తన మచ్చలను చూసుకోకుండా ఇతరుల మచ్చలను చూపిస్తుంటారు. ఎదుటివారి మీద బురద చల్లడం ఎంతవరకు సహేతుకం? ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ తరువాత ఏరుదాటి తెప్ప తగలేశారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు.
దైవాంస సంభూతులులాగ ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదం. ఈ కేసులన్నీ జగన్నాటకంలో ఒక పాత్ర. జగన్ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో సామాన్యుడు కూడా అధేవిధంగా ఉపయోగించుకుంటారు. మీలాంటి అక్రమార్కులు, కుట్రదారులను ఎదుర్కొనేందుకు మేం పోరాటం చేస్తాం. నియోజకవర్గ ప్రజలు క్షమాపణ చెప్పకుండా బరితెగించి మాట్లాడటం హాస్యాస్పదం. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర హెచ్చరించారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.