Dullipalla Narendra
Dhulipalla narendra : చంద్రబాబునాయుడుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బురదజల్లడం మానుకోవాలని మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా?. జంగిల్ రాజ్ గా రాష్ట్రాన్ని మార్చారు.
దళితుల భూములను, ఇళ్ల పట్టాలకు, బినామీ కంపెనీలకు ధారాదత్తం చేయడంపై మాట్లాడే దమ్ము ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉందా?. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీ ఎదుట తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మీద అనేక విమర్శలు చేశారు. విమర్శలు చేసే ముందు వారి గురించి ఆత్మావలోకనం చేసుకోవాలి. జీవో నెంబర్ 41..ని ఉదహరిస్తూ ఫిర్యాదు చేశారు. 17.2.2016 వ తేదిన చేసిన జీవో. రాష్ట్ర రాజధానిని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం, భూ సమీకరణ కోసం ఇచ్చిన జీవో. ఈ జీవోతో దళితులకు అన్యాయం జరిగిందనడంలో అర్థంలేదు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంగబలం, అర్దబలం కలిగిన వ్యక్తి. అన్యాయం జరిగి ఉంటే ఇన్నాళ్లు ఊరుకుండే వ్యక్తి కాదు. సుప్రీం కోర్టులో కేసులు వేసిన ఘనమైన చరిత్ర ఆయనకుంది. జీవో ఇచ్చేటప్పుడు ఎందుకు నోరు మెదపలేదు. ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీవోపై ఇన్నాళ్లు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటంలో అర్థంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైంది. కొత్తగా ఎమ్మెల్యే అయినట్లు, ఈ జీవో గురించి ఏమీ తెలియనట్లు మాట్లాడున్నారు.
దళితుల హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా దళితులపై ప్రేమ లేదు. ఆయన ధరించిన ముసుగు గురించి అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడును అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.ఇన్నాళ్లు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడంలో పెద్ద కుట్ర ఉంది. ఇన్నాళ్లు గుర్తుకు రాని దళితులు ఇప్పడు ఎలా గుర్తుకు వచ్చారు?
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. జగన్ పై ఉన్న కేసులకు సహకరిస్తూ సజావుగా ఎంక్వైరీలు జరిపితే ప్రజా ధనం వృధా కాకుండా ఉంటుంది. గురిగింజ సామెత జగన్ కు బాగా వర్తిస్తుంది. తన మచ్చలను చూసుకోకుండా ఇతరుల మచ్చలను చూపిస్తుంటారు. ఎదుటివారి మీద బురద చల్లడం ఎంతవరకు సహేతుకం? ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ తరువాత ఏరుదాటి తెప్ప తగలేశారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు.
దైవాంస సంభూతులులాగ ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదం. ఈ కేసులన్నీ జగన్నాటకంలో ఒక పాత్ర. జగన్ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో సామాన్యుడు కూడా అధేవిధంగా ఉపయోగించుకుంటారు. మీలాంటి అక్రమార్కులు, కుట్రదారులను ఎదుర్కొనేందుకు మేం పోరాటం చేస్తాం. నియోజకవర్గ ప్రజలు క్షమాపణ చెప్పకుండా బరితెగించి మాట్లాడటం హాస్యాస్పదం. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర హెచ్చరించారు.
Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది.…
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
This website uses cookies.