
people believing ysrcp is the only party ofr bc's
tirupati : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నోటిఫిషన్ విడుదల అయ్యింది. వచ్చే నెల 17వ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఏమి జరిగిన విజయం వైసీపీదే అన్నట్లు మారిపోయింది పరిస్థితి. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ దూసుకొనివెళ్తుంది. ఫ్యాన్ గాలి దెబ్బకు మిగిలిన ప్రతిపక్షాలు కుదేలు అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో తిరుపతిలో ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు, కానీ మెజారిటీ ఎంత అనేది ఇక్కడ సమస్య, ఎందుకంటే మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో కావచ్చు, నిన్నటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఘన విజయం సాధించింది. పైగా ఈ స్థానం కూడా వైసీపీ సిట్టింగ్ ఎంపీది. బల్లి దుర్గప్రసాద్ చనిపోవటంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 228376 మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మే బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ రెండురోజుల క్రితం ప్రకటించింది. బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి కాకుండా కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నా… ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండదు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ను ఇటీవల ఎమ్మెల్సీగా చేశారు.
ఇదిలా ఉండగా పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నామమాత్రంగా కూడా సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శించిన ఆధిక్యత కొనసాగాలంటే ఉప ఎన్నికలో కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకూ మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. దానికి కొంచమైన తగ్గితే వైసీపీ విజయంలో కిక్ ఉండదు అనే చెప్పాలి.
ఒక పక్క వైసీపీ ఏమో మెజారిటీ ఎంత అనే దానిపై లెక్కలు వేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షము టీడీపీ మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని గతంలోనే ప్రకటించాడు చంద్రబాబు. అయితే పోటీచేయటానికి ఆమె అంత సుముఖంగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిగా ఆమెను ఖరారు చేసిన తర్వాత పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఆమె ప్రభావం లేదు. ఇలాంటి స్థితిలో పోటీచేసి ఓటమి మూట కట్టుకోవటం అవసరమా అని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఆమె ఈ నెల 24వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె నామినేషన్ వేసేదాకా తెలియదు ఆమె పోటీలో ఉందో..? లేదో…? అని
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.