tirupati : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నోటిఫిషన్ విడుదల అయ్యింది. వచ్చే నెల 17వ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఏమి జరిగిన విజయం వైసీపీదే అన్నట్లు మారిపోయింది పరిస్థితి. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ దూసుకొనివెళ్తుంది. ఫ్యాన్ గాలి దెబ్బకు మిగిలిన ప్రతిపక్షాలు కుదేలు అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో తిరుపతిలో ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు, కానీ మెజారిటీ ఎంత అనేది ఇక్కడ సమస్య, ఎందుకంటే మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో కావచ్చు, నిన్నటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఘన విజయం సాధించింది. పైగా ఈ స్థానం కూడా వైసీపీ సిట్టింగ్ ఎంపీది. బల్లి దుర్గప్రసాద్ చనిపోవటంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 228376 మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మే బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ రెండురోజుల క్రితం ప్రకటించింది. బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి కాకుండా కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నా… ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండదు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ను ఇటీవల ఎమ్మెల్సీగా చేశారు.
ఇదిలా ఉండగా పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నామమాత్రంగా కూడా సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శించిన ఆధిక్యత కొనసాగాలంటే ఉప ఎన్నికలో కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకూ మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. దానికి కొంచమైన తగ్గితే వైసీపీ విజయంలో కిక్ ఉండదు అనే చెప్పాలి.
ఒక పక్క వైసీపీ ఏమో మెజారిటీ ఎంత అనే దానిపై లెక్కలు వేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షము టీడీపీ మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని గతంలోనే ప్రకటించాడు చంద్రబాబు. అయితే పోటీచేయటానికి ఆమె అంత సుముఖంగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిగా ఆమెను ఖరారు చేసిన తర్వాత పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఆమె ప్రభావం లేదు. ఇలాంటి స్థితిలో పోటీచేసి ఓటమి మూట కట్టుకోవటం అవసరమా అని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఆమె ఈ నెల 24వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె నామినేషన్ వేసేదాకా తెలియదు ఆమె పోటీలో ఉందో..? లేదో…? అని
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.