
Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి చిరంజీవి సతీమణి అరుదైన గిఫ్ట్.. ఖరీదు మూడున్నర లక్షల పైనే...!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రిగా సరికొత్త బాధ్యతని నిర్వర్తించబోతున్నాడు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాస్తా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విపక్షనేతగా సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పాలకుడిగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించగా, ఆయనకి దక్కిన ఈ గౌరవం పట్ల కుటుంబ సభ్యులు,అభిమానులు, పార్టీ వర్గాలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తన సోదరుడు చిరంజీవి కుటుంబాన్ని కలిశారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్లో పంచాయతీరాజ్ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం పవన్.. తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్కు వచ్చారు. కొణిదెల కుటుంబానికి పెద్ద కోడలిగా వచ్చే సమయానికి పవన్ చిన్న పిల్లాడు కావడంతో తన బిడ్డల్లాగే పెంచారు సురేఖ. తన వదినపై అభిమానాన్ని , అప్యాయతను ఎన్నో వేదికల మీద వెల్లిబుచ్చేవారు. చిరంజీవి సైతం పవన్ను తమ్ముడిలా కాకుండా పెద్ద కొడుకులా చూసుకుంటారు.తన కళ్ల ముందు పెరిగిన పవన్ కళ్యాణ్ గురించి సురేఖ తల్లి లాంటి బాధ్యతను నిర్వర్తించారు. పవన్ సినీ పరిశ్రమ వైపు రావడం వెనుక ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. పవన్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంట్లోనే గడిపేవాడు. ఎప్పుడు చూసినా తనదైన లోకంలో రిజర్వ్డ్గా ఇంట్లోనే ఉండేవాడట.వదినమ్మకు చేదోడు వాదోడుగా తలలో నాలుకలో ఉండేవారు పవన్ .
Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి చిరంజీవి సతీమణి అరుదైన గిఫ్ట్.. ఖరీదు మూడున్నర లక్షల పైనే…!
ఆయనకు ఇష్టమైన వంటకాలు , అభిరుచులు, మనస్తత్వం సురేఖకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదంటారు సన్నిహితులు. తన ఎన్నికల అఫిడవిట్లోనూ వదిన సురేఖ గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఆమె వద్ద రూ.2 కోట్లు అప్పులు తీసుకున్నానని తెలిపారు. తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ అత్యంత ఖరీదైన మోంట్బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో.. సురేఖ స్వయంగా పెన్ను తీసి పవన్ జేబులో పెట్టారు. అది చూసి పవన్ తెగ సంతోషపడ్డారు. సురేఖ.. పవన్కు ఇచ్చిన మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నుల ధరల శ్రేణి రూ.90 వేల నుంచి రూ.3.60 లక్షల వరకు ఉంటుంది అని తెలుస్తుంది.
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
This website uses cookies.