Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఎవరిని అడిగినా.. ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించే. దాని గురించే అందరి చర్చ. నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఓవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ బాబు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వారాహి యాత్ర పేరుతో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ ప్రసంగించినా.. సీఎం జగన్ జపమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జగన్ ను ఇంటికి పంపిస్తేనే రాష్ట్రానికి విముక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి.. పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. ఏపీలో ఒక్క వైసీపీ పార్టీని ఇంటికి పంపించేందుకు పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అని ప్రకటించారు.
అయినా.. ఇప్పటికే జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది. అలాగే.. టీడీపీతోనూ పొత్తు పెట్టుకునేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా.. మూడు పార్టీలు కలిసి.. అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా భవిష్యత్తులో పనిచేసే అవకాశం ఉంది. దానిపై పవన్ కూడా చాలాసార్లు మాట్లాడారు.ఒకప్పుడు పొత్తుల గురించి ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడటమే మానేశారు. దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించుకుంటే.. వారాహి యాత్రకు వస్తున్న ఆదరణ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఆదరణ బాగా లభిస్తోంది. వారాహి యాత్రను చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే వారాహి యాత్ర సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. దీంతో పవన్ కళ్యాణ్ ఇక జనసేన పార్టీ గురించి తప్పితే మరో పార్టీ గురించి మాట్లాడటం లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. ఒంటరిగా పోటీ చేసి గెలిచినా.. లేక పొత్తులతో గెలిచినా అధికారంలోకి రాగానే జనసేన ప్రభుత్వం ఏం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఏం హామీలు నెరవేరుస్తామో కూడా చెప్పలేనప్పుడు ప్రజలు అసలు జనసేనను ఎందకు గెలిపిస్తారు. ఈ చిన్న లాజిక్ ను పవన్ ఎలా మరిచిపోయారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.