
Pawan Kalyan
రెండో దశ వారాహి విజయ యాత్ర చివరి బహిరంగ సభ నిన్న తణుకులో జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడి పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావుకు తన స్పీచ్ ప్రారంభించక ముందు పబ్లిక్ గా ప్రజల సమక్షంలో క్షమాపణలు తెలియజేశారు. విషయంలోకి వెళ్తే గత ఎన్నికల సమయంలో విడివాడ రామచందర్రావు పార్టీ కోసం నిలబడిన పవన్ వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఆ టికెట్ కేటాయించిన వ్యక్తి పార్టీ విడిచి వెళ్ళిపోయారు.
కానీ టికెట్ ఇవ్వకపోయినా గానీ తణుకులో జనసేన పార్టీకి బలంగా నిలబడిన రామచందర్రావు నిజమైన నాయకుడు అని కొనియాడుతూ.. గత ఎన్నికలలో టికెట్ ఇవ్వనందుకు తనను క్షమించాలని ఈసారి మాత్రం తణుకులో ఎగరాలని పవన్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో పరోక్షంగా పవన్ తణుకు జనసేన పార్టీ టికెట్ విడివాడ రామచంద్రరావుకు కేటాయించినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. పబ్లిక్ మీటింగ్ లో మాత్రమే కాకుండా అంతకుముందు తణుకులో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో సైతం క్షమాపణలు తెలియజేశారు.
Pawan Kalyan
పార్టీ పట్ల నిబధత్తతో.. పనిచేసిన విడివాడ రామచంద్రరావుని వచ్చే ఎన్నికలలో గెలిపించుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా విడువాడ రామచంద్రరావు తణుకులో పోటీ చేయబోతున్నట్లు పవన్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పసుపులేటి రామారావు జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. వాస్తవానికి ఇక్కడ పార్టీ అభివృద్ధికి విడివాడ రామచంద్రరావు ఎంతగానో కృషిచేశారు. పార్టీ టిక్కెట్ ను ఆశించారు. కానీ చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన పసుపులేటి రామారావు తన్నుకుపోయారు. కానీ ఇక్కడ 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా కారుమూరి నాగేశ్వరరావు 2000 ఓట్లకు పైగా స్వల్ప మెజారిటీతో గెలిచారు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.