
Prashant Kishore : వైయస్ జగన్ విషయంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్య ప్రశాంత్ కిషోర్..!
Prashant Kishore : రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఓడిపోతారని అందుకు ఇవే కారణాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ప్రశాంత్ కిషోర్ ఒక లాజిక్ మర్చిపోతున్నారని అంటున్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకులంతా రాష్ట్రాన్ని ఆర్థికంగా కృంగదీస్తున్నారనే విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రజల డబ్బులు సంక్షేమ పథకాలతో ఇష్టం వచ్చినట్లుగా పంచుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా తప్పే. ప్రజల పరిస్థితులను మెరుగుపరిచేలా చేసుకోవాలి. ప్రజలకు మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు, నిత్యవసర వస్తువులు ధరలు తగ్గింపు ఇలాంటివి చేయాలి కానీ సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాలను ఆర్థికంగా కృంగతీస్తున్నారు. ఓట్ల కోసం ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం సరైనది కాదు అని కొందరు భావిస్తున్నారు.
ఇక ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించడం లేదు. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే వైయస్ జగన్ కచ్చితంగా ఓడిపోతారని చెబుతున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. మరోపక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని పరిస్థితి. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకం అందేలా చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే అసలు ఈ ఉచిత పథకాలను పట్టుకొచ్చిందే ఆయన. కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లకి ఉచిత పథకాల సలహా ఇచ్చింది ప్రశాంత్ కిషోరే. తెలంగాణ, కర్ణాటకలో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఉచిత పథకాలే అమలు అయ్యాయి. ఈ ఉచిత పథకాల వలన ఆర్థికంగా రాష్ట్రం వెనుకపడుతుంది. వీలైతే నిత్యవసర ధరలు, టికెట్ రేట్లు తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఇలా ఉచిత పథకాల వలన రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం జరిగింది కాదు.
ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నవరత్నాలు పేరిట ఉచిత పథకాల ఆలోచన ఇచ్చిందే ప్రశాంత్ కిషోర్. అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా, గొప్పోడు లాగా ఉచిత పథకాల సలహా ఇచ్చి రాష్ట్రాలను ఆర్థికంగా కృంగతీస్తున్నారు. ఇలాంటి పథకాలను పెట్టమని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన గెలవడని వ్యాఖ్యానించడం, విమర్శించడం ఏమాత్రం సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి కాకపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాటా ఎంత ఉందో ప్రశాంత్ కిషోర్ వాటా కూడా అంతే ఉంది. ఆయన ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఉచిత పథకాల సలహాల వలన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది అని అంటున్నారు. ఈ ఉచిత పథకాల వలన రాష్ట్రం అభివృద్ధి కాదు కదా తిరోగమనము లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా నాయకులంతా ఈ ఉచిత పథకాలు ఆపేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.