Prashanth Kishore : ఏపీలో శాసనసభ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఇక టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు టీడీపీని కలిసిన ప్రశాంత్ కిషోర్ ని చూసి వైసీపీకి మింగుడు పడటం లేదు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రం మొదటి నుంచి ఆయన ఒంటరిగా పోరాటం చేయడం, ఎంతమంది కలిసి వచ్చిన ప్రజల కోసం ఒక్కడినే పోరాడుతా అని చెప్పడం, దీని వలన టిడిపి జనసేన డామినేట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది జగన్ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలి. ఏం చేస్తే జగన్ ఓడిపోతాడు అనేదానిపైన చర్చించడం జరిగింది.
వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు ఇన్ఫార్మ్ ఇవ్వడం, ఏ ప్రాంతాలలో జగన్ కు చంద్రబాబుకు సర్వే లో ఎంత పాజిటివ్ గా ఉన్నది ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కోనసీమలో జగన్ కు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చంద్రబాబుకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. అయితే అక్కడ జనసేనకి ఎక్కువ టికెట్లు ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపి కనుక పోటీ చేస్తే జగన్ కు ఫేవర్గా ఉంది. ఒక సామాజిక వర్గం ఓట్లు జగన్ కు పడతాయి. ఆ ప్రాంతంలో జనసేనకు సీట్లు ఎక్కువగా ఇవ్వాలి అని కరాకండిగా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. దానిని చంద్రబాబు కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
టీడీపీ, జనసేన కలవడం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంతంలో ఓట్లు, సీట్లు కరెక్ట్ గా తెచ్చుకుంటే నే ఈ ప్రాంతం పాజిటివ్గా ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో అక్కడక్కడ దెబ్బతిన్నా కోనసీమ కవర్ చేస్తుంది అని అంటున్నారు. రెండు ఉభయగోదావరి జిల్లాలో జగన్ వైపు నిలబడితే కచ్చితంగా టీడీపీకి ఓటమి ఖాయం అని అంటున్నారు. కాబట్టి టీడీపీ, జనసేన చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది. అందుకే టీడీపీ, జనసేనకి ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఇవ్వాలి. రిస్క్ తీసుకొని టిడిపికి సీట్లు ఇస్తే అక్కడ ఓటమి ఖాయం అని, ఆ ప్రాంతంలో జగన్ కు పాజిటివ్ గా ఉందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాబట్టి టిడిపి కోనసీమ ప్రాంతంలో జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంద ని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తెలుస్తుంది ఇక అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా జనసేనకు ఓట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.