raghu-rama-krishna-raju-ap-cm-ys-jagan-vs-narsapuram-mp-raghu-rama-krishna-raju
Raghu rama krishna raju : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ రెబల్ ఎంపీ (నరసాపురం) రఘురామకృష్ణరాజుకు మధ్య నెలకొన్న కోల్డ్ వార్ కాస్తా ఏడాదికి పైగా హాట్ వార్ గా మారింది. అది ఈ మధ్య మరింత ముదిరింది. రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా సాయంతో డర్టీ ఫెల్లో మాదిరి పాలిటిక్స్ చేయటంతో ఆయనకి ఏపీ పోలీసులు తమదైన శైలిలో సన్మానం చేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రఘురామకృష్ణరాజు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు మొదలు పెట్టారు. రోజుకొకరు చొప్పున పెద్దలను కలుస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఫిర్యాదుల పరంపర కొనసాగించారు.
raghu-rama-krishna-raju-ap-cm-ys-jagan-vs-narsapuram-mp-raghu-rama-krishna-raju
సీబీసీఐడీ సీన్ కి ముందు రఘురామకృష్ణరాజు పచ్చ మీడియా మద్దతుతో రచ్చ (బండ) రచ్చ చేశారు. అనంతరం తన స్టైల్ మార్చారు. ప్రస్తుతం ఉత్తరాల ఉద్యమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి రోజుకొక లెటర్ రాస్తూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ప్రతిపక్షానికి మించి ప్రభుత్వ లోపాలను పట్టి చూపుతున్నారు. తద్వారా వైఎస్ జగన్ పై తన అక్కసును వెల్లగక్కుతున్నారని అధికార పార్టీ అంటోంది. ఈ నేపథ్యంలో అసలు రఘురామకృష్ణరాజు ఎందుకిలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారనే అనుమానం ప్రతిఒక్కరికీ రాకమానదు.
రఘురామకృష్ణరాజు రిచెస్ట్ ఎంపీ. రాజు అనే పేరుకు తగ్గట్లే సౌండ్ పార్టీ. అలాంటి వ్యక్తికి సహజంగానే ఇగో ఫీలింగ్ ఉంటుంది. దాంతో వైఎస్సార్సీపీలో తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం, హోదా దక్కాలని ఆశించారు. కానీ అక్కడ వైఎస్ జగనే ఫైనల్. రఘురామకృష్ణరాజును కూడా అందరిలాగే ఈక్వల్ గా ట్రీట్ చేయటంతో అతను బాగా హర్ట్ అయ్యాడు. చిన్నగా వైఎస్ జగన్ కి దూరం జరగటం మొదలు పెట్టాడు. అయినా వైఎస్ జగన్ పట్టించుకోలేదు. దీంతో రఘురామకృష్ణరాజు చిల్లర చిల్లరగా అల్లరి చేయటం ఆరంభించాడు. వైఎస్ జగన్ వ్యతిరేక మీడియాకి కావాల్సింది ఇలాంటోళ్లే. దీంతో వాళ్లు రఘురామకృష్ణ రాజును నెత్తిన పెట్టుకున్నారు. అతణ్నే మెయిన్ అపొజిషన్ లీడర్ రేంజ్ లో న్యూస్ కవరేజీ ఇస్తున్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు అసలు విషయం అర్థంకావట్లేదు. వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో గోబెల్స్ మాదిరిగా ప్రవర్తించే ఆ రెండు పత్రికలు, ఆ రెండు టీవీ ఛానెళ్లు రఘురామకృష్ణరాజును హీరోగా చూపిస్తున్నాయి. ఆయనకేమో అది స్థాన బలిమి కానీ తన బలిమి కాదనే సంగతి అవగాహన కావట్లేదు. టీడీపీకి, బీజేపీకి ఫేవర్ చేస్తూ పొలిటికల్ గా తననుతాను నష్టపరచుకుంటున్నారు. వైఎస్ జగన్ పై పైచేయి సాధిస్తున్నట్లు కలలు కంటున్నారు. రఘురామకృష్ణరాజు ఆ లోకంలోంచి ఎప్పుడు బయటికి వస్తారో.
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.