Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్కు వ్యక్తిగత అభిమానంతో ప్రజలు ముఖ్యమంత్రి పదవిని అప్పగించగా, ఆయన రాష్ట్రాన్ని ఐదేళ్లలో విధ్వంసం చేసాడని ఆరోపించారు. “రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చాడు” అనే తీవ్ర పదజాలంతో ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత తారాస్థాయికి పడిపోయాయని మండిపడ్డారు.
Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu : ప్రజలు వైసీపీ కి 11 సీట్లు ఇచ్చిన ఇంకా జగన్ కు సిగ్గురావడం లేదు – రామ్మోహన్ నాయుడు
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేస్తూ, ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పినప్పటికీ జగన్ తీరు మారడం లేదన్నారు. అధికారం కోల్పోయినప్పటికీ ఆయన మాటల్లో, ప్రవర్తనలో మార్పు కనిపించడంలేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజలు ఒక్కసారిగా వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని, ఇకపై రాష్ట్రంలో అభివృద్ధి మార్గమే రాజధానిగా మారనుందని పేర్కొన్నారు.
మహిళల భద్రత విషయంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టుగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా శాంతిభద్రతలను దెబ్బతీసే చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, ఇకపై పాలన ప్రజాకేంద్రీతంగా, పారదర్శకంగా సాగుతుందని ఆయన వివరించారు.
