TDP BJP : ఇంకా టీడీపీ, బీజేపీ మధ్య తేలని పొత్తు.. కారణం ఏంటి..?

Advertisement
Published by
Advertisement

TDP BJP : ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ ని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇక వీరితో బీజేపీ పొత్తు కూడా కలవబోతుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పొత్తుపై గంటకో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. పొత్తు ఖరారు అయిందని ఒకసారి లేదు ఇంకా చర్చలు జరుగుతున్నాయని మరోసారి. అన్ని ఓకే కానీ సీట్ల పంచాయతీ తేలలేదని ఇంకోసారి. ఇలా రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇక తాజాగా బీజేపీ , టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు. ఇంకా సీట్ల పంచాయతీ విషయంలో ఎలాంటి వివాదం లేదంటున్నారు. కేవలం పొత్తును అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. మరి పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమైంది అంటే బీజేపీ నేతల షెడ్యూల్ కారణంగానే అంటున్నారు.

Advertisement

పొత్తు లో సీట్ల ప్రకటన విషయంలో అమిత్ షా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తమ పార్టీ నాయకులను పిలిపించి ఎవరితో పొత్తు ఉండాలో, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో నిర్ణయిస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ముందు ఒడిశా రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు. అక్కడ నవీన్ పట్నాయక్ ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకే బీజేడీతో పొత్తులో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లు మిగతా సర్దుబాట్లపై వారితో చర్చించారు. అక్కడ బలాలను అంచనా వేసుకొని ఒక లిస్టు తయారు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోయే రెండో జాబితాలో ఒడిస్సాలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రేను కాదని వచ్చిన నేతల భవిష్యత్తుపై ఏకనాథ్ షిండే మహారాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఏకనాథ్ షిండే శివసేన, బీజేపీ ఇతర రెబల్ అభ్యర్థులు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది చర్చించారు. అయితే రెండు మూడు సీట్లు వ్యవహారంలో ఇరువర్గాలు పట్టుబట్టారు. దీంతో అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి.

Advertisement

మహారాష్ట్ర సీటు వ్యవహారం త్వరగా తేల్చుకొని టీడీపీ, జనసేనతో చర్చించాల్సి ఉందని బీజేపీ అంటుంది. అయితే మహారాష్ట్ర పంచాయతీ సుదీర్ఘంగా కొనసాగడంతో ఏపీ వ్యవహారం వాయిదా వేసారని సమాచారం. దీనిపై ఈ రెండు రోజుల్లో కచ్చితంగా ప్రకటన వస్తుందని అంటున్నారు. ఏపీలో సీట్ల పంచాయతీ లేదని సమాచారం. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతుందని, ఆ రెండు పార్టీలకు 8 వరకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని అంటున్నారు. ఇప్పటికే జనసేనకు ప్రకటించిన 24 స్థానాలు మినహాయిస్తే బీజేపీ ఆరు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతుంది. ఎంపి స్థానాల విషయానికి వస్తే జనసేనకు మూడు స్థానాలను ఇచ్చింది. మిగిలిన ఐదు స్థానాలు బీజేపీ అభ్యర్థులు నిలబడే అవకాశం ఉంటుంది. అరకు, కాకినాడ, రాజమండ్రి , అనకాపల్లి నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను జనసేన బీజేపీకి కేటాయించారు. మిగిలినవి టీడీపీ పోటీ చేయబోతుంది.

Advertisement

Recent Posts

Revanth Reddy : రైతులకి ఆనందంతో గంతులేసే రెండు శుభవార్తలు చెప్పిన CM రేవంత్

Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…

24 minutes ago

Modi on Iran : ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒకే ఒక్క మాట చెప్పిన మోడీ…!

Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…

1 hour ago

Dhurandhar 2 Collections : బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం .. ఇక 500 క్లబ్ లోకి చేరినట్లేనా..?

Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…

2 hours ago

Garikapati Narasimha Rao : బిగ్ బ్రేకింగ్.. గరికపాటి ని అరెస్ట్ చేయాలి.. సోష‌ల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌లు..?

Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…

3 hours ago

Vidadala Rajini : విడదల రజని కి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ .. వైసీపీకి రాజీనామా ?

Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…

4 hours ago

Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ .. గ్యాస్‌ సరఫరాలో మరిన్ని కష్టాలు .. కానీ ..!

Gas Cylinder  :  మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…

5 hours ago

Realme 5G : భారత మార్కెట్‌లో రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్ దూకుడు .. కేవలం 7,599 రూపాయలకే .. ఫీచర్లు ఇవే ..!

Realme 5G :  భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్‌మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఆ డబ్బులు విడదల .. నేడు బ్యాంకుల్లో నగదు జమ ..

Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…

6 hours ago

Gold Silver Rate 22 March 2026 : వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. రూ.10,000 పడిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే

Gold Silver Rate 22 March 2026 : బంగారం కొనాలనుకునే సామాన్యులకు, పసిడి ప్రియులకు ఇది నిజంగా పెద్ద…

8 hours ago

Fruits for summer : వేసవిలో ఆరోగ్యం కోసం ఈ పండ్లను తినండి .. ఇక డీహైడ్రేషన్ వంటి సమస్యలకు చెక్‌ ..!

Fruits for summer : ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే క్రమంలో ఎక్కువగా…

9 hours ago

Summer Drinks : భగభగ మండే ఎండలలో ఒంటిని చల్లబరిచే సూపర్ సమ్మర్ డ్రింక్స్ ఇవే …!

Summer Drinks : వేసవి కాలం మొదలైతేనే తీవ్రమైన ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి. అధిక వేడి…

10 hours ago

Saunf Water : వేసవిలో ‘శరీర వేడి’కి సహజ పరిష్కారం .. సోంపు నీటితో అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు ..!

Saunf Water : మారుతున్న వాతావరణ పరిస్థితులు, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే అధికంగా మసాలా ఆహారాలు తీసుకోవడం వల్ల…

11 hours ago