తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేనిది స్థానిక సంస్థల ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. తెలుగు దేశం పార్టీ మొదటి సారి స్థానిక సంస్థల ఎన్నికలకు మానిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ పార్టీ కూడా మ్యాని ఫెస్టోను విడుదల చేసింది లేదు. ఇది ఎన్నికల సంఘంకు ఫిర్యాదు కూడా చేశారు. కాని ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడం తప్పు ఏమీ కాదు అన్నట్లుగా ఎస్ఈసీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఈసీ నుండి కావాల్సినంత మద్దతు టీడీపీకి ఉన్నట్లుగా అనిపిస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవాలను చేయాలని ప్రయత్నిస్తే జరిగే పని లేదు. దాంతో తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించి గెలుపు సాధించి నైతికంగా వైఎస్ జగన్ పై విజయాన్ని సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి లోటు పాటు జరుగకుండా చూసుకోవడానికి తెలుగు దేశం పార్టీ పెద్ద టీమ్ ను ఏర్పాటు చేసుకుంది. చంద్రబాబు నాయుడ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 పార్లమెంట్ నియోజక వర్గాలను అయిదు జోన్లుగా విడదీసి బాధ్యులను ఎంపిక చేయడం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అందజేయడం జరిగింది. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ బాధ్యతలు చూసుకోబోతున్నారు. వారు క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుండి మొదలుకుని ప్రచారం వరకు అంతా చూసుకుంటారు.
ప్రత్యర్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరియు లీగల్ గా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సహాయం అందించేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు సిద్దంగా ఉంటారు. కింది స్తాయి తెలుగు తమ్ముళ్లు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రతి విషయంలో కూడా అభ్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తాం అని వైకాపా అభ్యర్థుల నుండి ఏదైన ఇబ్బంది ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని లేదంటే ఎస్ఈసీకి సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. మొత్తానికి తెలుగు దేశం పార్టీ పక్కా టీమ్ లను ఏర్పాటు చేసి గెలుపే లక్ష్యంగా దూసుకు పోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది చూడాలి.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.