ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి ఎలాగైనా సరే వైసీపీ పార్టీని జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు పొత్తుల కొనసాగుతూ వస్తున్నారు. అయితే అధికార వైసీపీ పార్టీ జాబితాలన్నీ విడుదల చేసి ముందంజలో ఉండగా కూటమి తాజాగా సీట్ల సర్దుబాటు పై క్లారిటీ ఇచ్చింది.అయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు ఉండగా 151 స్థానాలలో టిడిపి అభ్యర్థులు, 24 స్థానాలలో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉంటారని అలాగే ఎంపి స్థానాల్లో 3 చోట్ల జనసేన ఉంటుందని మిగిలిన చోట్ల టీడీపీ ఉంటుందని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే దాదాపు రెండు నెలల నుంచి ఈ పొత్తులో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ తరుణంలో ఎట్టకేలకు కూటమిలో సీట్ల సర్దుబాటు ముగిసింది. అయితే ఇప్పుడు ఈ సీట్లు పంపకం గురించి భారీ ప్రకంపనలు ఈ రెండు పార్టీల నుండి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి.
మరి ఆ ప్రకంపనలు ఏంటి వాటిని అధినేతలు ఎలా ఎదురుకోబోతున్నారు అనే అంశాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం.
ఇక విషయానికొస్తే నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలాగైనా సరే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఉద్దేశంతోనే కూటమి అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ పొత్తు ప్రకటన చేసిన తర్వాత సహజంగా అందరూ ఊహించినట్టుగానే ప్రకంపణలు గట్టిగానే స్టార్ట్ అయ్యాయి.ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జాబితాలు విడుదల చేయడం మొదలుపెట్టారో అప్పుడు చాలామంది అసంతృప్తులు బయటికి రావడం జరిగింది. అయితే జగన్ కూడా వరుసగా జాబితాలు జాబితాలు విడుదల చేస్తూ వచ్చారు.ఎందుకంటే అసంతృప్తులు బయటికి వస్తారు… ఎలాంటి పరిస్థితి ఏర్పడబోతోంది…సర్వే సంస్థలు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరు వీక్ గా ఉన్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా జాబితాలను విడుదల చేస్తూ వచ్చారు. అయితే అలా జాబితాలను విడుదల చేస్తున్నప్పుడు వరుసగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నయని చెప్పాలి.
ఎందుకంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన మాట కచ్చితంగా వినాలి అనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అసంతృప్తులు చాలామంది పార్టీలు మారిపోవడం.. పార్టీ నుంచి బయటికి వెళ్లడం.. వేరే పార్టీలో చేరడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో అధికార పక్షంలో ఉన్న వ్యక్తి అభ్యర్థులను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వారి అభ్యర్థులను కంట్రోల్ చేయడం కష్టమని చెప్పాలి. ఇక ఇప్పుడు వీరు కూడా వారి జాబితాలను విడుదల చేయడంతో అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు వైసీపీ పార్టీ ఎదుర్కొన్న అసంతృప్తుల సెగ ఇప్పుడు జనసేన మరియు టీడీపీ పార్టీలో కూడా కనిపించబోతోందని స్పష్టంగా అర్థమవుతుంది. దీని కారణంగా ఓట్ బ్యాంకింగ్ చీలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రకంపనులను పార్టీ అధినేతలు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.