
chandrababu lakshmi parvathi
TDP : మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ ను తీవ్రమైన పదజాలలతో తిట్టిన విషయం తెలిసిందే, దీనికి కౌంటర్ గా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, తండ్రి శవపు ముద్దలను పక్కనపెట్టుకొని అధికారంకోసం బేరాలాడినవారు కాదు. తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కనీసం తలనొప్పికూడా రాలేదు. చంద్రబాబు మగాడు కాబట్టే, పవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి బారినుంచి టీడీపీని కాపాడి, ఆ తర్వాత నుండి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు చంద్రబాబు అంటూ మాణిక్యరావు అన్నాడు.
కళావర్ రాణి అయిన కొడాలినానీ వింతజంతువు. దాన్ని కొట్టినా, తిట్టినా అది వినేజంతువుకాదు. దానిఖర్మన అది పోవాల్సిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతంగా ముందుకెళు తున్నసమయంలో చంద్రబాబునాయుడిపై సీఐడీతో తప్పుడు కేసులుపెట్టారు. సీఐడీవిభాగం గతంలో ప్రభుత్వం చేతిలో ఎలా అభాసుపాలైందో తెలుసు. కమలాసన్ రెడ్డి, అలియాస్ పిచ్చిరెడ్డితో తప్పుడు కేసుపెట్టించి, సీఐడీతో నోటిసులిచ్చారు. దానిపైకోర్టు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
విశాఖ ఉద్యమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. ఆసభ విజయవంతం కాకూడదనే, బూతులమంత్రి కొడా లినానీతో ప్రభుత్వం బూతులు తిట్టించింది. పనికిమాలిన, వెధవభాష మాట్లాడే కొడాలిని తిరిగిమాటనడం ఎంతోసేపు పట్టదు. అతనికంటే వెధవ, పోరంబోకు, అక్షరజ్ఞానంలేని వాడు మరొకడు ఉండడు. అసలు కొడాలి నాని కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా… బూతులకు పుట్టాడా? అంటూ ధ్వజమెత్తాడు పిల్లి మాణిక్యరావు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చనిపోయాడని, అతనిశవంతో చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడని కొడాలినాని మాట్లాడాడు. అతని పుట్టుకను అవమానించేలా మాట్లాడాలికానీ, నానీ తల్లిదండ్రుల ముఖం చూసిఊరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎవరూ చనిపో లేదు. ఉద్యమంలో భాగంగా తానుచావడానికి సిద్దమని మాత్రమే చెప్పాడు. అదే తెలియచేస్తూ లేఖరాశాడు. అటువంటి వ్యక్తి వ్యాఖ్యపై మంత్రి ఎలా మాట్లాడాలి. తమపార్టీఎంపీ లున్నారు, వారు వీరులు,శూరులు పార్లమెంట్ లో పోరాడి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని చెప్పాల్సిన బాధ్యత కళావర్ రాణిపై లేదా? వైసీపీఎంపీలంతా సిగ్గుతో తలొంచుకోవాలంటూ పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగాడు.
స్టీల్ ప్లాంట్ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడవద్దని, తామంతా ఉన్నామని భరోసాకల్పించేలా టీడీపీఎంపీ రామ్మో హన్ నాయుడు మాట్లాడాడు గానీ, వైసీపీఎంపీ ఒక్కడూ మాట్లాడలేదు. ప్రాణాలు తీసుకోవడంవల్ల ఏంసాధించలేమని స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి టీడీపీఎంపీ ధైర్యాన్ని నూరిపోశాడు. ఇటువంటి ఆలోచనలు వైసీపీఎంపీలకు రావు. వారుఏనాడూ కూడా రాష్ట్రప్రయోజనాలగురించి పార్లమెంట్లో మాట్లాడింది లేదు. మోడీదగ్గర మోకాళ్లొంచుకొని, ఆయనమోచేతి నీళ్లు తాగడానికితప్ప, వైసీపీఎంపీలు దేనికి పనికొస్తారంటూ మాట్లాడాడు పిల్లి.. మరి ఈయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
This website uses cookies.