
chandrababu lakshmi parvathi
TDP : మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ ను తీవ్రమైన పదజాలలతో తిట్టిన విషయం తెలిసిందే, దీనికి కౌంటర్ గా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, తండ్రి శవపు ముద్దలను పక్కనపెట్టుకొని అధికారంకోసం బేరాలాడినవారు కాదు. తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కనీసం తలనొప్పికూడా రాలేదు. చంద్రబాబు మగాడు కాబట్టే, పవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి బారినుంచి టీడీపీని కాపాడి, ఆ తర్వాత నుండి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు చంద్రబాబు అంటూ మాణిక్యరావు అన్నాడు.
కళావర్ రాణి అయిన కొడాలినానీ వింతజంతువు. దాన్ని కొట్టినా, తిట్టినా అది వినేజంతువుకాదు. దానిఖర్మన అది పోవాల్సిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతంగా ముందుకెళు తున్నసమయంలో చంద్రబాబునాయుడిపై సీఐడీతో తప్పుడు కేసులుపెట్టారు. సీఐడీవిభాగం గతంలో ప్రభుత్వం చేతిలో ఎలా అభాసుపాలైందో తెలుసు. కమలాసన్ రెడ్డి, అలియాస్ పిచ్చిరెడ్డితో తప్పుడు కేసుపెట్టించి, సీఐడీతో నోటిసులిచ్చారు. దానిపైకోర్టు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
విశాఖ ఉద్యమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. ఆసభ విజయవంతం కాకూడదనే, బూతులమంత్రి కొడా లినానీతో ప్రభుత్వం బూతులు తిట్టించింది. పనికిమాలిన, వెధవభాష మాట్లాడే కొడాలిని తిరిగిమాటనడం ఎంతోసేపు పట్టదు. అతనికంటే వెధవ, పోరంబోకు, అక్షరజ్ఞానంలేని వాడు మరొకడు ఉండడు. అసలు కొడాలి నాని కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా… బూతులకు పుట్టాడా? అంటూ ధ్వజమెత్తాడు పిల్లి మాణిక్యరావు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చనిపోయాడని, అతనిశవంతో చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడని కొడాలినాని మాట్లాడాడు. అతని పుట్టుకను అవమానించేలా మాట్లాడాలికానీ, నానీ తల్లిదండ్రుల ముఖం చూసిఊరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎవరూ చనిపో లేదు. ఉద్యమంలో భాగంగా తానుచావడానికి సిద్దమని మాత్రమే చెప్పాడు. అదే తెలియచేస్తూ లేఖరాశాడు. అటువంటి వ్యక్తి వ్యాఖ్యపై మంత్రి ఎలా మాట్లాడాలి. తమపార్టీఎంపీ లున్నారు, వారు వీరులు,శూరులు పార్లమెంట్ లో పోరాడి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని చెప్పాల్సిన బాధ్యత కళావర్ రాణిపై లేదా? వైసీపీఎంపీలంతా సిగ్గుతో తలొంచుకోవాలంటూ పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగాడు.
స్టీల్ ప్లాంట్ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడవద్దని, తామంతా ఉన్నామని భరోసాకల్పించేలా టీడీపీఎంపీ రామ్మో హన్ నాయుడు మాట్లాడాడు గానీ, వైసీపీఎంపీ ఒక్కడూ మాట్లాడలేదు. ప్రాణాలు తీసుకోవడంవల్ల ఏంసాధించలేమని స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి టీడీపీఎంపీ ధైర్యాన్ని నూరిపోశాడు. ఇటువంటి ఆలోచనలు వైసీపీఎంపీలకు రావు. వారుఏనాడూ కూడా రాష్ట్రప్రయోజనాలగురించి పార్లమెంట్లో మాట్లాడింది లేదు. మోడీదగ్గర మోకాళ్లొంచుకొని, ఆయనమోచేతి నీళ్లు తాగడానికితప్ప, వైసీపీఎంపీలు దేనికి పనికొస్తారంటూ మాట్లాడాడు పిల్లి.. మరి ఈయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
This website uses cookies.