chandrababu lakshmi parvathi
TDP : మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ ను తీవ్రమైన పదజాలలతో తిట్టిన విషయం తెలిసిందే, దీనికి కౌంటర్ గా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, తండ్రి శవపు ముద్దలను పక్కనపెట్టుకొని అధికారంకోసం బేరాలాడినవారు కాదు. తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కనీసం తలనొప్పికూడా రాలేదు. చంద్రబాబు మగాడు కాబట్టే, పవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి బారినుంచి టీడీపీని కాపాడి, ఆ తర్వాత నుండి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు చంద్రబాబు అంటూ మాణిక్యరావు అన్నాడు.
కళావర్ రాణి అయిన కొడాలినానీ వింతజంతువు. దాన్ని కొట్టినా, తిట్టినా అది వినేజంతువుకాదు. దానిఖర్మన అది పోవాల్సిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతంగా ముందుకెళు తున్నసమయంలో చంద్రబాబునాయుడిపై సీఐడీతో తప్పుడు కేసులుపెట్టారు. సీఐడీవిభాగం గతంలో ప్రభుత్వం చేతిలో ఎలా అభాసుపాలైందో తెలుసు. కమలాసన్ రెడ్డి, అలియాస్ పిచ్చిరెడ్డితో తప్పుడు కేసుపెట్టించి, సీఐడీతో నోటిసులిచ్చారు. దానిపైకోర్టు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
విశాఖ ఉద్యమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. ఆసభ విజయవంతం కాకూడదనే, బూతులమంత్రి కొడా లినానీతో ప్రభుత్వం బూతులు తిట్టించింది. పనికిమాలిన, వెధవభాష మాట్లాడే కొడాలిని తిరిగిమాటనడం ఎంతోసేపు పట్టదు. అతనికంటే వెధవ, పోరంబోకు, అక్షరజ్ఞానంలేని వాడు మరొకడు ఉండడు. అసలు కొడాలి నాని కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా… బూతులకు పుట్టాడా? అంటూ ధ్వజమెత్తాడు పిల్లి మాణిక్యరావు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చనిపోయాడని, అతనిశవంతో చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడని కొడాలినాని మాట్లాడాడు. అతని పుట్టుకను అవమానించేలా మాట్లాడాలికానీ, నానీ తల్లిదండ్రుల ముఖం చూసిఊరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎవరూ చనిపో లేదు. ఉద్యమంలో భాగంగా తానుచావడానికి సిద్దమని మాత్రమే చెప్పాడు. అదే తెలియచేస్తూ లేఖరాశాడు. అటువంటి వ్యక్తి వ్యాఖ్యపై మంత్రి ఎలా మాట్లాడాలి. తమపార్టీఎంపీ లున్నారు, వారు వీరులు,శూరులు పార్లమెంట్ లో పోరాడి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని చెప్పాల్సిన బాధ్యత కళావర్ రాణిపై లేదా? వైసీపీఎంపీలంతా సిగ్గుతో తలొంచుకోవాలంటూ పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగాడు.
స్టీల్ ప్లాంట్ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడవద్దని, తామంతా ఉన్నామని భరోసాకల్పించేలా టీడీపీఎంపీ రామ్మో హన్ నాయుడు మాట్లాడాడు గానీ, వైసీపీఎంపీ ఒక్కడూ మాట్లాడలేదు. ప్రాణాలు తీసుకోవడంవల్ల ఏంసాధించలేమని స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి టీడీపీఎంపీ ధైర్యాన్ని నూరిపోశాడు. ఇటువంటి ఆలోచనలు వైసీపీఎంపీలకు రావు. వారుఏనాడూ కూడా రాష్ట్రప్రయోజనాలగురించి పార్లమెంట్లో మాట్లాడింది లేదు. మోడీదగ్గర మోకాళ్లొంచుకొని, ఆయనమోచేతి నీళ్లు తాగడానికితప్ప, వైసీపీఎంపీలు దేనికి పనికొస్తారంటూ మాట్లాడాడు పిల్లి.. మరి ఈయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
This website uses cookies.