TDP : రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అలాగే.. రాజకీయాల్లో అనుభవం కూడా చాలా ముఖ్యం. అనుభవం లేకపోతే ఏం చేయలేం. అనుభవం అనేది చాలా కీలకం. రాజకీయ అనుభవం ఎంత ఎక్కువ ఉంటే.. రాజకీయాల్లో అంతగా రాణించగలరు. కానీ.. ఆ అనుభవం నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్లు ఏపీని బాగానే పాలించింది కానీ.. 2019 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లాంటి వాటితో వాళ్ల కంట్లో వాళ్లే వేలు పెట్టుకొని పొడుచుకున్నారు. అలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి అరకు నియోజకవర్గం.
అరకు నియోజకవర్గం అనేది ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో ఎస్టీకి చెందిన నేత కిడారి సర్వేశ్వరరావు గెలిచారు. ఆయన గెలిచింది వైసీపీ నుంచి. కానీ.. ఆ తర్వాత ఆయన టీడీపీ ప్రభుత్వం రావడంతో టీడీపీకి జై కొట్టారు. ఆ తర్వాతి క్రమంలో కిడారిని మావోయిస్టులు చంపేశారు. దీంతో ఆయన కొడుకు కిడారి శ్రవణ్ ను చేరదీసిన చంద్రబాబు.. మంత్రిని కూడా చేశావరు. 2019 ఎన్నికల్లో అదే అరకు నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఇచ్చారు. కానీ.. 2019 ఎన్నికల్లో సింపతీ వర్కవుట్ కాలేదు. శ్రవణ్ కుమార్ ఓడిపోయారు. డిపాజిట్ కూడా ఆయనకు దక్కలేదు.కిడారి శ్రవణ్ కుమార్ ఓడిపోవడానికి కారణం టీడీపీలోని ఆధిపత్య పోరే అంటున్నారు. తన సొంత తండ్రిని మావోయిస్టులు చంపడంతో ఆయనపై అక్కడి గిరిజనుల నుంచి సింపతీ వచ్చినా.. అదే గిరిజన జాతికి చెందిన సియ్యారి దొన్నుదొర టికెట్ కావాలని పట్టుబట్టి రచ్చ రచ్చ చేశారు.
దీంతో చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టారు. అయినా కూడా పట్టువదలకుండా దున్ను దొర.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దాని వల్ల.. అక్కడ ఓట్లు చీలిపోయాయి. గిరిజనుల్లోనే చాలామందికి ఎవరికి ఓటు వేయాలో అర్థం కాలేదు. దాని వల్ల అరకులో ఓడిపోయే పరిస్థితి టీడీపికి వచ్చింది. ఇక.. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కూడా మళ్లీ కిడారి, సియ్యారి వర్గాలు టికెట్ కోసం పోటీ పడుతున్నాయి. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో చంద్రబాబుకు కూడా అర్థం కావడం లేదట. చూద్దాం ఏం జరుగుతుందో?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.