Talliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారుల ఎంపికలో కొత్త మార్గదర్శకాలు
Talliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తును వేగవంతం చేసింది. కొత్త బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.9407 కోట్లు కేటాయించగా, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకారం, కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే, ఒకే విడతగా చెల్లిస్తారా లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లింపులు చేయాలా అన్న విషయంపై ఇంకా చర్చ కొనసాగుతోంది.
Talliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారుల ఎంపికలో కొత్త మార్గదర్శకాలు
పథకం అమలులో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కీలక మార్గదర్శకాలు రూపొందించబడుతున్నాయి. విద్యార్థుల 75 శాతం హాజరును తప్పనిసరి నిబంధనగా కొనసాగించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండిన ఆదాయపన్ను చెల్లింపుదారులు, తెల్లరేషన్ కార్డు లేని వారు, అధిక విద్యుత్ వినియోగం చేసేవారికి మినహాయింపు నిబంధనలను సమీక్షిస్తున్నారు. కొత్త మార్గదర్శకాల్లో ఈ నిబంధనలు కొనసాగించాలా లేక సడలింపులు ఇవ్వాలా అన్న అంశంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో “తల్లికి వందనం” పథక అమలులో కొన్ని సందిగ్ధతలు తలెత్తుతున్నాయి. ఒకే విడతలో మొత్తం రూ.15 వేలు చెల్లిస్తారా, లేదా రెండు విడతలుగా రూ.7500 చొప్పున ఇవ్వాలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. విద్యాశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం దాదాపు 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పన కొనసాగుతుండగా, మే నెలలో అమలు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 9. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం, ఒక…
Black Salt : చాలామంది ఎక్కువగా తెల్ల ఒప్పుకునే వినియోగిస్తుంటారు. అయితే,ఈ తెల్ల ఉప్పు కన్నా కూడా ఆయుర్వేదంలో ఎన్నో…
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
Tea : ఈరోజుల్లో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీ తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం…
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా…
Kethireddy : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి…
Love Couple : ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో మానవత్వాన్ని తలదించుకునేలా చేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపట్టణం…
This website uses cookies.