Times Now Survey : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో ఉంటాయి ఎన్నికలు. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులోనే కొన్ని సంస్థలు కూడా సర్వేలు చేసి ఏ పార్టీ గెలుస్తుందో చెబుతున్నాయి. ఎన్ని సర్వేలు ఏం చెప్పినా కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనేది క్లారిటీగా ఇప్పుడే చెప్పలేం. ఎన్నికల వరకు ఏం జరిగినా ఊహించలేం. కానీ.. చాలామటుకు సర్వేలన్నీ సీఎం జగన్ వైపే, వైసీపీ పార్టీ వైపే ఉన్నాయి.
రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ కు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారని చాలా సర్వే సంస్థలు చెబుతున్నాయి. వైసీపీ వచ్చే ఎన్నికల్లో మామూలు విజయం కాదు.. క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు. దీంతో నిజంగానే ఏపీలో వైసీపీకి అంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఏదో చిన్నాచితకా సర్వే సంస్థల సర్వేలను ఎవ్వరూ నమ్మరు కానీ.. ప్రముఖ మీడియా సంస్థ అయిన టైమ్స్ నౌ తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. జన్ గన్ కామన్ పేరుతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ గెలిచేది ఎన్డీఏ పార్టీనే అంటూ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ అంటే బీజేపీ కూటమే కాబట్టి మళ్లీ ప్రధాని మోదీనే. ఎన్డీఏకు కనీసం 300 నుంచి 325 వరకు సీట్లు వస్తాయట. కాంగ్రెస్ కు 150 లోపే వస్తాయట. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 22 స్థానాలు వస్తాయట. ఇక ఏపీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాల వరకు వైసీపీ గెలుస్తుందట. అంతే కాదు.. దేశంలోనే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలిచే పార్టీల్లో మూడో పార్టీగా వైసీపీ అవతరించనుందని సర్వే సంస్థ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇంత సత్తా చాటితే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నట్టే కదా.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.