
times now survey on ap elections 2024
Times Now Survey : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో ఉంటాయి ఎన్నికలు. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులోనే కొన్ని సంస్థలు కూడా సర్వేలు చేసి ఏ పార్టీ గెలుస్తుందో చెబుతున్నాయి. ఎన్ని సర్వేలు ఏం చెప్పినా కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనేది క్లారిటీగా ఇప్పుడే చెప్పలేం. ఎన్నికల వరకు ఏం జరిగినా ఊహించలేం. కానీ.. చాలామటుకు సర్వేలన్నీ సీఎం జగన్ వైపే, వైసీపీ పార్టీ వైపే ఉన్నాయి.
రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ కు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారని చాలా సర్వే సంస్థలు చెబుతున్నాయి. వైసీపీ వచ్చే ఎన్నికల్లో మామూలు విజయం కాదు.. క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు. దీంతో నిజంగానే ఏపీలో వైసీపీకి అంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఏదో చిన్నాచితకా సర్వే సంస్థల సర్వేలను ఎవ్వరూ నమ్మరు కానీ.. ప్రముఖ మీడియా సంస్థ అయిన టైమ్స్ నౌ తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. జన్ గన్ కామన్ పేరుతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
times now survey on ap elections 2024
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ గెలిచేది ఎన్డీఏ పార్టీనే అంటూ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ అంటే బీజేపీ కూటమే కాబట్టి మళ్లీ ప్రధాని మోదీనే. ఎన్డీఏకు కనీసం 300 నుంచి 325 వరకు సీట్లు వస్తాయట. కాంగ్రెస్ కు 150 లోపే వస్తాయట. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 22 స్థానాలు వస్తాయట. ఇక ఏపీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాల వరకు వైసీపీ గెలుస్తుందట. అంతే కాదు.. దేశంలోనే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలిచే పార్టీల్లో మూడో పార్టీగా వైసీపీ అవతరించనుందని సర్వే సంస్థ వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇంత సత్తా చాటితే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నట్టే కదా.
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
This website uses cookies.