Unda valli Sridevi : ఉండవల్లి శ్రీదేవి తిరిగి సొంతగూటికి చేరేనా..?

Unda valli Sridevi : రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని అని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డిని వదిలి వెబ్ కి వ్యతిరేకంగా పార్టీ కి వ్యతిరేకంగా ఓటు వేసి పార్టీలో నుండి సస్పెండ్ అయ్యి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడ కూడా దారుణంగా మోసపోయారు ఉండవల్లి శ్రీదేవి అనే మాట ఇప్పుడు వైసీపీ శ్రేణులతో పాటు తెలుగుదేశం శ్రేణులలో కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది.అయితే ఇప్పుడు ఆమె అడుగులు ఎటు ఉన్నాయి. ఆమె అపాయింట్మెంట్ జగన్ కోరుకుంటున్నారా..? కోరుకుంటే ఏం అడగబోతున్నారు..? ఇక జగన్ మోహన్ రెడ్డి రెస్పాన్స్ ఈ విషయంలో ఎలా ఉంది…? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుస్తుంది ప్రయత్నం చేద్దాం.అయితే పార్టీ నుంచి బయట రావడం వేరు వచ్చాక మాట్లాడే మాటలు వేరు. అయితే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ పార్టీ ని వదిలి వెళ్ళినపుడు జగన్ మోహన్ రెడ్డిని చాలా మాటలు అన్నారు. మరి ఇప్పుడు జగన్ ఎలా రియాక్ట్ అవుతరో ఇప్పుడు తెలుసుకుందాం.. విషయంలోకి వెళితే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్ ఇస్తుందా అంటే ఇవ్వదు అని చెప్పాలి. ఒకవేళ ఇస్తే ఆమె కోరుకున్న నియోజకవర్గంతో పాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో ఇచ్చే అవకాశాలు కొంచెం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె తాటికొండకు మాజీ ఎమ్మెల్యే.

కాని టీడీపీ ఇప్పుడు తాటికొండను తీసుకువెళ్లి శ్రవణ్ కుమార్ చేతిలో పెట్టారు. ఈ శ్రవణ్ కుమార్ గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఉండవల్లి శ్రీదేవి గట్టిగా మోసపోయారు అని తెలిసిపోతుంది. ఇక తాడికొండ నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో శ్రీదేవికి టికెట్ లేకుండా పోయింది. ఇక వేరే నియోజకవర్గంలో అయిన టికెట్టు కల్పిస్తారా అంటే గుంటూరు , కృష్ణాజిల్లాలో ఎస్సీ నియోజకవర్గంలో సీట్లు నిండిపోయాయి. గుంటూరులో వేమూరి ఎస్టి నియోజకవర్గం మీద నక్క ఆనంద్ బాబు ఉన్నారు. ఇదే జిల్లాలో పత్తిపాడు రామాంజనేయులకు కేటాయించారు. కృష్ణాజిల్లా, నందిగామ , తిరువూరు మిగతా సీట్లన్నీ కూడా నిండిపోయాయి. అయితే ప్రస్తుతం ఆమెకు ఎక్కడ సీట్ లేకపోవడంతో శ్రీదేవికి ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయింది. దీంతో ఆమె వైసీపీ కి వెళ్దామని ఆమె సపోర్టుగా ఉండే అనుచరులు కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే తాటికొండకు వైసీపీ ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మళ్లీ వైసీపీకి వెళ్లి ప్రయత్నాలు చేసుకుందాం టికెట్ గురించి అడుగుదాం.. అనవసరంగా వచ్చాం అని ఒక క్షమాపణ చెప్పడం లేదా డిస్కషన్ చేద్దామని ఆమె అనుచరులు చెబుతున్నట్టుగా సమాచారం.

ఎందుకంటే ఒకప్పుడు బొత్స సత్యనారాయణ విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఆన్ రికార్డ్ బయట మీడియాలో ఆన్ రికార్డు లో తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాని ఆయనే ప్రస్తుతం వైసీపీలో బిగ్గెస్ట్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన చరిత్ర కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నప్పుడు ఇక ఇప్పుడు నేను కూడా వెళ్తే తప్పేంటి అని ఆలోచనలో ఉండవల్లి శ్రీదేవి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తాడేపల్లి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం ఈమె ప్రయత్నాలు చేస్తున్నారు అనే మాట గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా తెలుగుదేశం పార్టీ తనకు ద్రోహం చేసిందని మళ్లీ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటే చూడమని ఆమె అనుచరులు ఆమెకు సలహాలు ఇస్తున్నారని సమాచారం. మరి ఈ విషయంపై మీకున్న రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

51 minutes ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

2 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

11 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

12 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

13 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

15 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

16 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

17 hours ago