Vijayasai Reddy : ఆంధ్ర ప్రజలు పామునైన నమ్ముతారు కానీ కాంగ్రెస్ ను మాత్రం నమ్మరు.. విజయసాయిరెడ్డి..!

Advertisement
Advertisement

Vijayasai Reddy  : మొన్నటి వరకు జరిగిన తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రయాణాలను మొదలుపెట్టారు. ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా కొత్త బాధ్యతలను షర్మిల స్వీకరించబోతున్నారు. విజయవాడలోని కానూరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో షర్మిల ఎపిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టనున్నారు.అయితే ఈ కార్యక్రమానికి ముందు ఆమె తన సొంత జిల్లాకు వెళ్తారు. ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి గారైన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అయితే షర్మిల వెంట మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రారావు మాజీ మంత్రులు ఎన్ రఘువీరారెడ్డి , సాకే శైలజానధ్ , రాజంపేట లోక్ సభ ఇన్చార్జి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా మరియు తదితర నాయకులు కూడా ఉన్నారు.

Advertisement

అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిల స్వీకరించబోతున్న వేళ..కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి వి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలు చేయసాగారు. అదేవిధంగా పలు రకాల ఆరోపణలను కూడా గుప్పించారు. గత కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కాంగ్రెస్ పార్టీని పాముతో పోల్చారు. అయితే 2004 మరియు 2009లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడం పై ఉమ్మడి ఏపీ అత్యంత కీలకంగా వ్యవహరించిందని సాయి రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సాధించిన లోక్ సభ స్థానాల గురించి ఆయన వివరించారు.ఇక ప్రస్తుత కాలంలో కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు గుర్తించకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నారని , ఇక ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమయం ఆసన్నమైందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఏపీ ప్రజలు డిమాండ్స్ ను మరియు అవసరాలను కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదంటూ ఆయన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి గుణపాఠం నేర్చుకున్నారని అన్ని విధాలుగా మోసగించిన ఆ పార్టీ ని ఇక్కడి ప్రజలు ఇకపై విశ్వసించబోరని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలంటే పామునైన నమ్ముతారేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పటికీ నమ్మరని స్పష్టం చేశారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

4 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

5 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

6 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

7 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

8 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

9 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

10 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.