
YS Bharathi Reddy : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు వారి సతీమణులు కూడా జోరుగా ప్రచారాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరియు కోడలు నారా బ్రాహ్మణి పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఆంధ్ర మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాలయ్య చిన్న కూతురు కూడా రాజకీయాల్లోకి దిగి తన నాన్న కోసం ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. ఇక వైయస్ జగన్ తరుపున ఆయన భార్య భారతి ప్రచారాలలో పాల్గొనకపోయినప్పటికీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఆంధ్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారారు.
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వైయస్ భారతి ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదా..?ఏ సెక్టార్ లో కూడా వ్యతిరేకత రాలేదా..?వచ్చి ఉంటే ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు వైయస్ భారతి సమాధానమిస్తూ…నేను కూడా కొన్ని సందర్భాలలో ఈ ప్రశ్నలను విన్నాను. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నివసించని వారు , ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండేవారు పథకాల ధ్వారా ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని అంటున్నారు. అది ఏమాత్రం వాస్తవం కాదని భారతి కొట్టిి పడేశారు. మనం ఎలాగైతే మన పిల్లలకు విద్య వైద్యం ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటామో అవన్నీ కూడా అందరికీ అందించాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ఒక పేద పిల్లాడికి చదువుని అందిస్తే వారు చెడిపోతారు అనుకోవడం, సోమరిపోతులు అవుతారు అనుకోవడం సరైనవి కాదు కదా అంటూ భారతి తెలియజేశారు. అలాగే సంక్షేమ పథకాల ద్వారా జగన్ డబ్బులు ఇస్తున్నారని కొంతమంది అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రజలకు అందిస్తున్న ప్రతి పథకం వెనుక ఒక కారణం ఉందని భారతి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైయస్ఆర్ చేయూత పథకం గురించి మాట్లాడుతూ వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు 4 విడతలలో కొంత డబ్బు అందిస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా ప్రజలు సోమరిపోతులు అవుతారు అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. ఎందుకంటే పేదింటి మహిళలు పనికి పోతే తప్ప ఏమి కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం బాగోలేక కొన్నిసార్లు పనికి వెళ్లకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది మహిళలకు ఈ వైయస్ఆర్ చేయూత పథకం అండగా నిలుస్తుందని భారతి తెలియజేశారు. జగన్ ప్రభుత్వం పై ఈ విధమైన ప్రచారాలు అన్నీ కూడా ప్రతిపక్షాలు ఆలోచన లేకుండా చేస్తున్న మాటలు తప్ప మరేమీ లేదని , రాష్ట్రంలోని ప్రజలను కొన్ని పథకాల ద్వారా ఆదుకోవడం సోమరిపోతులను చేయడం కాదని ఈ సందర్భంగా భారతి చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాజకీయాలలో జగన్ పథకాలు ఇస్తూ ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడు అనే వారికి భారతి గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి.
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
This website uses cookies.