Ys jagan : రూట్ మార్చిన జగన్.. మళ్లీ అధికారం కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు...!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ఈ సారి చాలా చోట్ల దారుణంగా ఓడింది. ఏకంగా 175 సీట్లకు 164 సీట్లలో కూటమి గెలవగా, అటు వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అధికార పక్షం కాదు కాబట్టి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ మధ్య జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు తరచుగా చేస్తున్న ఓ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోందని, పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత తనదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నట్లు తెలిపారు. దీంతో జగన్ అధికారం కోల్పోయి విపక్ష హోదా కూడా లేకుండా పోయినా ఇంకా చంద్రబాబును, టీడీపీని భయపెడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జగన్ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతికూల పరిస్థితుల మధ్య అసెంబ్లీకి వెళ్లడానికి జగన్ ఇష్టపడట్లేదని చెబుతున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్.. లోక్సభకు పోటీ చేస్తారని అంటున్నారు. పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో జగన్ నిలబడొచ్చని చెబుతున్నారు.
Ys jagan : రూట్ మార్చిన జగన్.. మళ్లీ అధికారం కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు…!
తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గంలో తన తల్లి వైఎస్ విజయమ్మను బరిలో దింపుతారని తెలుస్తోంది. పులివెందుల నుంచి తల్లిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బలపడింది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంతగా బలమైన పక్షంగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందని జగన్ యోచిస్తోన్నట్లు చెబుతున్నారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.