Vinukonda Rashid Murder : ఏపీలో ఇప్పుడు అరాచక పాలన నడుస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు, హత్యాకాండలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం.. నాయకులు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో యాత్రకు సిద్ధమైతున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా వినుకొండలో నడిరోడ్డుపై వైసీపీ నేత రషీద్ హత్య ఏపీలో సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ యువజన విభాగ నేత రషీద్ ని జిలాని అనే వ్యక్తి నడిరోడ్డు పై రెండు చేతులు నరికి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ హత్య ఘటన పైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని నడిరోడ్డుపై జరిగిన దారుణ మారణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ స్పందించిన జగన్ బెంగళూరు నుండి హుటాహుటిని ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు.ఈ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు అతి కిరాతకంగా చంపిన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని, ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడం కోసమే వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు వినుకొండ వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ సంఘటనలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదులు కూడా చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్ మండిపడుతున్నారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.