
Ys Sharmila : వివేకానంద హత్య కేసు పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.... వారిద్దరే గొడ్డలితో నరికి చంపారు...!
Ys Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్ఆర్ కుటుంబాల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్ కు వ్యతిరేకంగా వైయస్ షర్మిల మరియు వైయస్ వివేకానంద కూతురు వయసు సునీత దీటుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సునీత మరియు షర్మిల ఓ పర్యటనలో భాగంగా ప్రజల సమక్షంలో మాట్లాడుతూ వివేకానంద హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ సునీత మాట్లాడుతూ…మా నాన్న వివేకానంద కడప జిల్లా నుండి షర్మిల పోటీ చేయాలని ఎంతో తాపత్రయపడ్డారు. ఆమె రాజకీయాల్లో ఎదగడాన్ని కల్లారా చూడాలనుకున్నారు. ఇక ఆ కారణం వల్లనే ఆయన్ని అత్యంత క్రూరంగా గొడ్డలితో నరికి చంపారు. ఇక ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు.నిజంగా ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇవన్నీ చూసే సహించేవాడా.
ఆయన తమ్ముని క్రూరంగా రాజకీయాల కోసం చంపినా ఎం పట్టనట్టు మౌనంగా ఉండేవాడా…తన కూతురు వైఎస్ షర్మిల ని ఈ విధంగా కష్టపేడుతుంటే చూసే సహించేవాడా అంటూ సునీత వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రజలందరూ మీ ఓటు హక్కుతో షర్మిలమ్మకు ఓటు వేసి మీ యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలిసేలా తెలియజేయాలంటూ సునీత చెప్పుకొచ్చారు. అనంతరం మాట్లాడిన వైయస్ షర్మిల ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు కడప రాజకీయాలను మనం చూస్తున్నాం. గతంలో ఇదే కడప జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైయస్ వివేకానంద రెడ్డి గారు నాయకులుగా వ్యవహరించారు. ఇక వారు నాయకులుగా ఉన్న సమయంలోవారిద్దరూ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ ప్రజలు కష్టాలను ఎలా తీర్చారో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లేరు , ఇక వివేకానంద రెడ్డి గారిని రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా నడిరోడ్డుపై గొడ్డలితో నరికి మరీ చంపించారు .
Ys Sharmila : వివేకానంద హత్య కేసు పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్…. వారిద్దరే గొడ్డలితో నరికి చంపారు…!
ఇవన్నీ మన కళ్ళముందేే జరిగాయి. హత్య చేయించిన అవినాష్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా ఇప్పుడు వాడే కడప జిల్లాలో పోటీ చేస్తున్నాడు. బాబాయ్ హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ ఈ కేసు పై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వైయస్ జగన్ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ఈ అంతకులను కాపాడుతున్నారంటూ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. బాబాయ్ హత్య కేసులో జగన్ పాత్ర కూడా ఉండటం వల్లనే ఈ కేసును ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారంటూ షర్మిల తెలియజేశారు. ఇలాంటి హంతకులకు అధికారం ఇచ్చి మరోసారి తప్పు చేయవద్దంటూ ఈసారి కడప జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వివేకానంద కలను నిజం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ , షర్మిల తెలియజేశారు. దీంతో ప్రస్తుతం షర్మిల మరియు సునిత చేసిన వ్యాఖ్యలు కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
Railway Train : భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. చాలా మంది ప్రయాణికులు ఇలాంటి…
Doctor : హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు…
Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని, బంధుత్వాలకు హద్దులు ఉండవని చెప్పే సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా…
Peddi Box Office Collection Day 4 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన…
Mother : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, అవసరానికి…
Karthika Deepam 2 Today Episode 8th June 2026 : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…
Mrigasira Karthe 2026 : తెలుగు సంప్రదాయాలు, ప్రకృతి చక్రం, ఆరోగ్య పరిరక్షణ.. ఈ మూడింటి కలయికే మృగశిర కార్తె.…
Tea : ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీసులో పని మధ్యలో మరో కప్పు.. సాయంత్రం స్నేహితులతో కలిసి…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం…
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
This website uses cookies.