YS Sharmila : నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు .. వై.ఎస్.షర్మిల..!

Advertisement
Advertisement

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వై.యస్.షర్మిల బాధ్యతలు స్వీకరించారు. జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరు వదిలిన బాణం కాదని వ్యాఖ్యానించారు. మహిళా కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించాను అని చెప్పారు. స్వార్థం కోసం చూసుకోలేదు అని అన్నారు. తెలుగు ప్రజలు బాగుపడాలి కాబట్టే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతుందన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం. ఆ మాట కోసం పనిచేస్తున్నానని, తెలంగాణలో ఓ నియంతను గద్దె దించాం, నా పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడింది అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని విలీనం చేశారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నియంతలా వ్యవహరిస్తారని ఆమె మండిపడ్డారు. జాతీయ పార్టీలు అలా ఉండదన్నారు. ఏపీలో 175 స్థానాలు 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. జనవరి 23 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటన జరుగుతుందని చెప్పారు. 9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పర్యటనలు ఉంటాయని, పార్టీలో చేరికలు కూడా ఉంటాయని ఆమె తెలిపారు.

Advertisement

మరోవైపు టీడీపీ, వైసీపీ, బీజేపీల పైన షర్మిల విమర్శల గుప్పించారు. మణిపూర్ లో సంఘటనల వలన దేశానికి బీజేపీ అవసరం లేదన్నారు. మణిపూర్ లో అంత జరుగుతున్న క్రిస్టియన్ అయిన సీఎం జగన్ స్పందించలేదన్నారు. పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ వాళ్లేనని షర్మిల చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అని తెలిపారు. ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలు చెబుతారని షర్మిల వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

Recent Posts

Biryani Leaf Benefits : బిర్యానీ ఆకులు రుచికే కాదు .. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలివే ..!

Biryani Leaf Benefits : మన వంటింట్లో తరచుగా కనిపించే బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కేవలం వంటకాలకు సువాసన,…

46 minutes ago

Dates vs Almonds : ఖర్జూరం vs బాదం ఆరోగ్యానికి ఏది మంచింది.. ఏది మీకు ఎక్కువ ప్రయోజనం తెలుసా ?

Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…

2 hours ago

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

3 hours ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

11 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

11 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

12 hours ago