
YS Sharmila : నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు .. వై.ఎస్.షర్మిల..!
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వై.యస్.షర్మిల బాధ్యతలు స్వీకరించారు. జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరు వదిలిన బాణం కాదని వ్యాఖ్యానించారు. మహిళా కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించాను అని చెప్పారు. స్వార్థం కోసం చూసుకోలేదు అని అన్నారు. తెలుగు ప్రజలు బాగుపడాలి కాబట్టే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతుందన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని షర్మిల పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం. ఆ మాట కోసం పనిచేస్తున్నానని, తెలంగాణలో ఓ నియంతను గద్దె దించాం, నా పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడింది అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని విలీనం చేశారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నియంతలా వ్యవహరిస్తారని ఆమె మండిపడ్డారు. జాతీయ పార్టీలు అలా ఉండదన్నారు. ఏపీలో 175 స్థానాలు 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. జనవరి 23 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటన జరుగుతుందని చెప్పారు. 9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పర్యటనలు ఉంటాయని, పార్టీలో చేరికలు కూడా ఉంటాయని ఆమె తెలిపారు.
మరోవైపు టీడీపీ, వైసీపీ, బీజేపీల పైన షర్మిల విమర్శల గుప్పించారు. మణిపూర్ లో సంఘటనల వలన దేశానికి బీజేపీ అవసరం లేదన్నారు. మణిపూర్ లో అంత జరుగుతున్న క్రిస్టియన్ అయిన సీఎం జగన్ స్పందించలేదన్నారు. పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ వాళ్లేనని షర్మిల చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అని తెలిపారు. ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలు చెబుతారని షర్మిల వ్యాఖ్యానించారు.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.