YS Sharmila : జ‌గ‌న్ , మోడీ, బాబు 420 లు అంటూ.. ఏపీ ప్ర‌త్యేక హోదాపై కంట‌త‌డితో వైఎస్ ష‌ర్మిల‌..!

Advertisement
Advertisement

YS Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వై.యస్ షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ మరియు జనసేన పార్టీలపై వై.యస్ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పుకొస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా షర్మిల ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల తో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతిజ్ఞ చేశారు . అయితే తాజాగా కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్ షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతుందని, అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఊసే లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

ఇక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా పై ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అయితే హోదా అంటే ఏంటో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.అందుకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడుతున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తన భుజాలపై ఎత్తుకుందని ఇక ఈ ఉద్యమం ఉవ్వెత్తున జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ విధంగా జరగకపోతే ప్రత్యేక హోదా అస్సలు సాధించలేమని ఈ సందర్భంగా వై.యస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రత్యేక హోదా విషయంలో దాదాపు 10 ఏళ్లపాటు మనం గొర్రెలు అయ్యామని , అందుకే వారు మనల్ని బలి పశువుల్లాగా బలి తీసుకుంటున్నారని తెలియజేశారు. మనం గొర్రెల మాదిరిగా కాకుండా ప్రత్యేక హోదా కోసం సింహంలా పోరాటం చేయాలని ఈ సందర్భంగా వై.యస్ షర్మిల పిలుపునిచ్చారు.అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిన మోదీ ఒక డీఫాల్ట్ అని మోడీ ఒక కేడి అంటూ వై.యస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఇప్పటికే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని…కానీ మన రాష్ట్ర రాజకీయ నాయకులైన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదాపై అసలు ఊసే లేదంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

Advertisement

తన వ్యక్తిగత లాభాల కోసం ఆంధ్ర రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రత్యేక హోదా సాధించే దిశగా అలాగే విభజన సమస్యల సాధన కోసం ఆమె ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టారని తెలియజేశారు. అందుకే ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ శ్రేణులు అందరూ ఉద్యమించాల్సి ఉందని ప్రత్యేక హోదా పొందేందుకు ఖచ్చితంగా పోరాడాలని ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా రాజధాని లేకపోవడం దురదృష్టకరమని తెలియజేశారు. అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్ల వెనక్కి పడిపోయిందని అందుకే ప్రత్యేక హోదా సాధించాలని ఇక అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వై.యస్ షర్మిల తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఆమె ఎంతకైనా తెగిస్తానని పలువురు నేతలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. దీంతో ప్రస్తుతం వై.యస్ షర్మిల చేసిన కామెంట్స్ ఆంధ్ర రాజకీయాలల్లో తీవ్ర చర్చానియాంశంగా మారాయి.

Recent Posts

Ranabaali Movie : హిస్టారికల్ హీట్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ గ్లింప్స్ రివ్యూ..!

Ranabaali Movie  : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…

4 hours ago

Ambati Rambabu : లోకేష్ రెడ్ బుక్ కు కుక్క కూడా భయపడదు : అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book  అంశం అధికార, ప్రతిపక్షాల…

5 hours ago

Indiramma Houses : గుడ్‌న్యూస్‌.. ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం… ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీల‌క అప్‌డేట్‌!

Indiramma Houses :  పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…

6 hours ago

Amaravati Capital : చంద్రబాబు , జగన్ మాటలను అమరావతి రైతులు నమ్మడం లేదా.?

Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…

7 hours ago

Loan: ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌..!

Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…

10 hours ago

Tale of Two Loves : భార్య ప్రాణాలను కాపాడడం కోసం 75 ఏళ్ల వృద్ధుడు చేసిన సాహసం మాటల్లో చెప్పలేం !!

Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…

11 hours ago

Business Idea : నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే బిజినెస్ ఇదే !!

Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…

12 hours ago

Bald Head : భార్యకు బట్టతల వచ్చిందని భర్త ఏంచేసాడో తెలుసా ?

Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…

13 hours ago