YS Sharmila : జ‌గ‌న్ , మోడీ, బాబు 420 లు అంటూ.. ఏపీ ప్ర‌త్యేక హోదాపై కంట‌త‌డితో వైఎస్ ష‌ర్మిల‌..!

Advertisement
Published by
Advertisement

YS Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వై.యస్ షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ మరియు జనసేన పార్టీలపై వై.యస్ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పుకొస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా షర్మిల ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల తో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతిజ్ఞ చేశారు . అయితే తాజాగా కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్ షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతుందని, అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఊసే లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

ఇక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా పై ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అయితే హోదా అంటే ఏంటో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.అందుకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడుతున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తన భుజాలపై ఎత్తుకుందని ఇక ఈ ఉద్యమం ఉవ్వెత్తున జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ విధంగా జరగకపోతే ప్రత్యేక హోదా అస్సలు సాధించలేమని ఈ సందర్భంగా వై.యస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రత్యేక హోదా విషయంలో దాదాపు 10 ఏళ్లపాటు మనం గొర్రెలు అయ్యామని , అందుకే వారు మనల్ని బలి పశువుల్లాగా బలి తీసుకుంటున్నారని తెలియజేశారు. మనం గొర్రెల మాదిరిగా కాకుండా ప్రత్యేక హోదా కోసం సింహంలా పోరాటం చేయాలని ఈ సందర్భంగా వై.యస్ షర్మిల పిలుపునిచ్చారు.అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిన మోదీ ఒక డీఫాల్ట్ అని మోడీ ఒక కేడి అంటూ వై.యస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఇప్పటికే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని…కానీ మన రాష్ట్ర రాజకీయ నాయకులైన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదాపై అసలు ఊసే లేదంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

Advertisement

తన వ్యక్తిగత లాభాల కోసం ఆంధ్ర రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రత్యేక హోదా సాధించే దిశగా అలాగే విభజన సమస్యల సాధన కోసం ఆమె ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టారని తెలియజేశారు. అందుకే ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ శ్రేణులు అందరూ ఉద్యమించాల్సి ఉందని ప్రత్యేక హోదా పొందేందుకు ఖచ్చితంగా పోరాడాలని ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా రాజధాని లేకపోవడం దురదృష్టకరమని తెలియజేశారు. అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్ల వెనక్కి పడిపోయిందని అందుకే ప్రత్యేక హోదా సాధించాలని ఇక అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వై.యస్ షర్మిల తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఆమె ఎంతకైనా తెగిస్తానని పలువురు నేతలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. దీంతో ప్రస్తుతం వై.యస్ షర్మిల చేసిన కామెంట్స్ ఆంధ్ర రాజకీయాలల్లో తీవ్ర చర్చానియాంశంగా మారాయి.

Advertisement

Recent Posts

students : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ .. రేపు సెలవు లేదు .. ఒంటి పూట బడులపై కీలక నిర్ణయం..!

students : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…

59 minutes ago

Kerosene : యుద్ధం ఎఫెక్ట్ .. ‘బ్యాకప్’ కిరోసిన్ .. మోదీ ప్రభుత్వం కొత్త ప్లాన్!

Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…

2 hours ago

Kushi movie sequel : ఖుషి సీక్వెల్ .. పవన్ భూమిక విడాకుల తరవాత లెక్చరర్లు గా..!

Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan  కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…

4 hours ago

Gold and Silver Price 13 March 2026 : పసిడి ప్రియులకు బంపరాఫర్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. మార్చి 13 లేటెస్ట్ రేట్లు ఇవే!

Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…

5 hours ago

Laddulu : ఈ స్పెషల్ లడ్డులు తిన్నరాంటే .. ఆరోగ్యంతో పాటు .. నడుము నొప్పి, కాళ్ళ నొప్పులక్‌ చేక్‌ ..!

Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…

6 hours ago

Fruits for Hydration : వేసవిలో డీహైడ్రేషన్‌కు చెక్ .. శరీరాన్ని చల్లబరచే ఈ పండ్లు జ్యూస్‌లు తీసుకుంటే చాలు..!

Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…

7 hours ago

Ugadi astrology : ఉగాది నుంచి ఈ రాశుల వారికి రాజయోగం .. వీరికి కొత్త సమస్యలు ..!

Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…

8 hours ago

YS Jagan : జగన్ చెప్పిందే జరిగింది .. వివేకా కేసులో సుప్రీం లో సంచలనం..!

YS Jagan :  మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…

17 hours ago

Pawan Kalyan : పవన్ నెత్తిన అతిపెద్ద బరువు పెట్టిన మోడీ.. డీల్ చెయ్యగలడా ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…

17 hours ago

AP Politics : ఉగాది రోజు ఉదయాన్నే.. ఏపీ లో రాజకీయ భూకంపం !

AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…

18 hours ago

Revanth Reddy : తెలంగాణా విద్యార్ధులకి ఎగిరి గంతేసే వార్త చెప్పిన CM రేవంత్ రెడ్డి

Revanth Reddy :  తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…

20 hours ago