
Second Saturday holiday for educational institutions cancelled tomorrow
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి దశ పునరావృత పాఠాలతో బిజీగా ఉన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్ల పంపిణీ పూర్తయ్యింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. పరీక్షలు సజావుగా జరగేందుకు అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
students : విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ .. రేపు సెలవు లేదు .. ఒంటి పూట బడులపై కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్టులో నిర్వహించబడతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనేక పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
పరీక్షల నేపథ్యంలో విద్యాసంస్థల పనిదినాల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. కృష్ణాజిల్లాలో రేపు జరిగే రెండో శనివారం సెలవును రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నెల 14వ తేదీన కూడా సాధారణంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో జిల్లా కలెక్టర్ అన్ని విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవులకు బదులుగా ఇప్పటికే మూడు రోజుల పాటు అదనంగా పాఠశాలలు నిర్వహించారని అధికారులు తెలిపారు. ఇంకా మిగిలిన ఒక రోజు సెలవుకు బదులుగా రాబోయే రెండో శనివారం పాఠశాలలు పనిచేయాలని నిర్ణయించారు.
ఇటీవల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒంటిపూట బడులు అమలు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే పాఠశాలలు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే కొనసాగనున్నాయి. ఎండల తీవ్రత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం తరగతుల సమయాల్లో మార్పు ఉంటుంది. ఆ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగతా తరగతులకు సంబంధించిన వార్షిక పరీక్షలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరీక్షల పనుల్లో బిజీగా కనిపిస్తున్నారు. అధికారులు పరీక్షల నిర్వహణను సమర్థంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
YS Jagan : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.…
This website uses cookies.