Raghu Babu : జగన్ పాలనని ఆకాశానికి ఎత్తేసిన రఘుబాబు.. మా ఇంట్లో పనివారు ఎంతో సంతోషంగా ఉన్నారు..!
Ysrcp : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఘర్ వాపసీకి తెరతీసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తో మొదలైన ఇది వైసీపీలో జోరు అందుకుంటుంది అనే అంచనాలు ఉన్నాయి. ఘర్ వాపసీలో భాగంగా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. గతంలో వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళని, వివిధ కారణాలతో బయటికి వెళ్లిన వారిని తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. గుంటూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల బాధ్యతలను ఆర్కే కు వైసీపీ అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అలాగే వంగవీటి రాధా తో కూడా వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది . ఇటు విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ తో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తో భేటీ అయ్యారు. టికెట్ ఇస్తే వైసీపీలోకి వస్తానని జలీల్ ఖాన్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.
పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జలీల్ ఖాన్ తో అయోధ్య రామిరెడ్డి అన్నట్లు తెలుస్తుంది. అయితే ఘర్ వాపసీతో వైసీపీలోకి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఫ్యామిలీతో కూడా వైసీపీ సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఘర్ వాపసీ ద్వారా వివిధ కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లిన వారిని తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇతర పార్టీలోకి వెళ్లినవారు అనుకూలంగా అక్కడ లేకపోవడంతో మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ఆశ చూపుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఘర్ వాపసీకి వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెళ్లిపోయిన నేతలను మళ్లీ నియోజకవర్గంలో చేర్చుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా వారితో మాట్లాడి చేరికలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీని వీడి వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ తిరిగి పార్టీలోకి చేర్చుకుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సిద్ధం సభలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి సక్సెస్ అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కొత్త ఇన్చార్జిలను కూడా నియమించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలో నియోజకవర్గాల అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేకపోయారు. ఈ క్రమంలో వైసీపీ దూకుడుగా ప్రవర్తిస్తుంది. కొత్తగా ఘర్ వాపసీని తెరపైకి తీసుకువచ్చింది. గతంలో వైఎస్ కుటుంబానికి చెందిన నేతలు పార్టీని వీడి వెళ్లి వేరే పార్టీలోకి వెళ్లిన వాళ్లను ఈ ఘర్ వాపసీద్వారా మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపి మళ్లీ వైసీపీలోకి తీసుకువచ్చారు.
Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు…
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది…
HIV : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధిస్తున్న హెచ్ఐవీ (HIV) వైరస్ను నివారించడంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమెరికా ఫుడ్…
New Sim Card Rules : ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ…
Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది.…
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత - బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో…
PMEGP : ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ (PMEGP) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర…
Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి…
This website uses cookies.