
Mithun Reddy : అప్పుడు చంద్రబాబు ఉంచిన బ్లాక్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం రాత్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్టు చేసింది. విజయవాడ సిట్ కార్యాలయంలో సుమారు ఏడుగంటల పాటు విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని, ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆసక్తికరంగా ఆయనకు కేటాయించిన బ్లాక్ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్న స్నేహ బ్లాక్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Mithun Reddy : అప్పుడు చంద్రబాబు ఉంచిన బ్లాక్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
మిథున్ రెడ్డికి జైలు అధికారులు రిమాండ్ ఖైదీ నెంబర్ 4196 కేటాయించారు. జైలు అధికారులను కలిసి ఆయన కోరిన కోరికల మేరకు, మౌలిక వసతులు కలిగిన స్నేహ బ్లాక్ను కేటాయించారు. అయితే ఆయన ఓ టీవీ ఏర్పాటు చేయాలనీ కోరినట్లు తెలుస్తుంది. కాసేపట్లో మిథున్ తరఫున లాయర్ ఆయన్ను కలవనున్నారు. సిట్ అధికారులు దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జ్షీట్ ప్రకారం, లిక్కర్ పాలసీ రూపకల్పనలో, షెల్ కంపెనీల ద్వారా అవినీతి, మనీలాండరింగ్ వంటి విషయాల్లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 300 పేజీల ఛార్జ్షీట్, 268 మంది సాక్షుల వివరాలు సమర్పించినట్లు కోర్టుకు తెలియజేశారు. కేసులో రూ.62 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇక వైసీపీ నేతలు మిథున్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. మిథున్ తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ అరెస్టును పూర్తిగా రాజకీయ కక్షతో కూడినదిగా అభివర్ణించారు. మిథున్ ఎలాంటి తప్పూ చేయలేదని, చట్టపరంగా నిర్దోషిగా బయటకు వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. తాము న్యాయపరంగా పోరాడుతామని, రాజకీయ కక్షలు ఎంతగా వచ్చినా, నిజం వెలుగు చూస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ కేసు రాజకీయ వేదికపై మరో మలుపు తిరిగింది.
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
This website uses cookies.