YCP : కూటమి విజయం తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం.. హోటల్ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు. ఏంది వైసీపీ పరిస్థితి ఇలా మారిందని అందరు చర్చించుకుంటున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన నియోజకవర్గంలోని 14 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారు పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకొన్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలకు చెందిన ఎంపీటీసీలు మంగళవారం సాయంత్రం ఆయా మండలాల టీడీపీ నాయకులతో కలిసి విజయవాడకు చేరుకుని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కలిశారు. బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు చంద్రబాబు స్వయంగా పసుపు కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో సమావేశమయ్యారు.
సుమారు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 మంది సర్పంచులు, 60 మంది ఎంపీటీసీలు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లాంచనంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. అతి త్వరలో కుప్పం నుంచి పలువురు వైసీపీ నాయకులూ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే 175 స్థానాల్లోనూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇక వైసీపీ ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పిన కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పై చంద్రబాబు 48,006 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో… కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. అందుకు గల పలు కారణాలూ తెరపైకి వస్తున్నాయి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.