YCP : కూటమి విజయం తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం.. హోటల్ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు. ఏంది వైసీపీ పరిస్థితి ఇలా మారిందని అందరు చర్చించుకుంటున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన నియోజకవర్గంలోని 14 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారు పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకొన్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలకు చెందిన ఎంపీటీసీలు మంగళవారం సాయంత్రం ఆయా మండలాల టీడీపీ నాయకులతో కలిసి విజయవాడకు చేరుకుని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కలిశారు. బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు చంద్రబాబు స్వయంగా పసుపు కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో సమావేశమయ్యారు.
సుమారు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 మంది సర్పంచులు, 60 మంది ఎంపీటీసీలు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లాంచనంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. అతి త్వరలో కుప్పం నుంచి పలువురు వైసీపీ నాయకులూ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే 175 స్థానాల్లోనూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇక వైసీపీ ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పిన కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పై చంద్రబాబు 48,006 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో… కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. అందుకు గల పలు కారణాలూ తెరపైకి వస్తున్నాయి.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.