YCP : కూటమి విజయం తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం.. హోటల్ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు. ఏంది వైసీపీ పరిస్థితి ఇలా మారిందని అందరు చర్చించుకుంటున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన నియోజకవర్గంలోని 14 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారు పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకొన్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలకు చెందిన ఎంపీటీసీలు మంగళవారం సాయంత్రం ఆయా మండలాల టీడీపీ నాయకులతో కలిసి విజయవాడకు చేరుకుని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కలిశారు. బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు చంద్రబాబు స్వయంగా పసుపు కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో సమావేశమయ్యారు.
సుమారు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 మంది సర్పంచులు, 60 మంది ఎంపీటీసీలు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లాంచనంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. అతి త్వరలో కుప్పం నుంచి పలువురు వైసీపీ నాయకులూ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే 175 స్థానాల్లోనూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇక వైసీపీ ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పిన కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పై చంద్రబాబు 48,006 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో… కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. అందుకు గల పలు కారణాలూ తెరపైకి వస్తున్నాయి.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.