Gautam Gambhir : కొత్త హెడ్ కోచ్, కొత్త కెప్టెన్తో భారత యువ జట్టు శ్రీలంక గడ్డపై అడుగుపెట్టి క్లీన్ స్వీప్ చేయడం మనం చూశాం. ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా దుమ్మురేపింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ సిరీస్ గెలుపులో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తన స్ట్రాటజీ చూపించగా, కొత్త కెప్టెన్ తమ జట్టు ఆటగాళ్లని అద్భుతంగా ఆడి విజయం దక్కేలా చేశాడు. అయితే చివరి మ్యాచ్ రోజు అవార్డ్ సెర్మనీలో ఆటగాళ్లందరు కూడా ట్రోఫీ చేతిలో పట్టుకొని ఫొటోలకి పోజులు ఇచ్చారు. ట్రోఫీని అందుకుని ఫొటో దిగాల్సిందిగా గంభీర్ ను రింకూ సింగ్, రియాన్ పరాగ్ రిక్వెస్ట్ చేశారు. కానీ అతడు మాత్రం ట్రోఫీని టచ్ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ట్రోఫీని గంభీర్
హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్ కే తమ జట్టుకి విజయం అందించేలా చేశాడు గౌతమ్ గంభీర్. తన మార్క్ వ్యూహాలతో శ్రీలంకను 3-0తో చిత్తు చేశాడు. రియాన్ పరాగ్ ను కొత్త ఆల్ రౌండర్ గా, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ను పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా పరిస్థితులకు తగ్గట్లుగా వాడుకున్న తీరు అద్భుతం. ఎవ్వరూ ఊహించని విధంగా రింకూ, సూర్యలతో చివరి టీ20లో బౌలింగ్ చేయించి.. ఫలితం రాబట్టాడు గంభీర్. అయితే తన వ్యూహాలతో సిరీస్ గెలిపించిన గంభీర్.. సెలబ్రేషన్స్ లో మాత్రం వెనకాలే ఉండిపోయాడు. గంభీర్ తో సహా అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చిన గంభీర్ మాత్రం చివర్లో నిల్చున్నాడు. రింకూ మాత్రం చాలా సేపు గంభీర్ ను బతిమిలాడాడు. కానీ ట్రోఫీని పట్టుకోవడానికి అతడు నో చెప్పాడు. అలాగే చివర్లో నిల్చుండిపోయాడు గంభీర్. దీనికి ప్రత్యేక కారణం ఏది లేదు. ఇది ఆటగాళ్ల సమిష్టి విజయం కావడంతో వారి చేతుల్లోనే కప్ ఉంటే బాగుంటుందని గంభీర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇక శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై పడింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లతో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల రాకతో భారత జట్టు బలం పెరిగింది. ఇక హెడ్ కోచ్గా తొలి సిరీస్తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ పై ఫోకస్ పెట్టాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును సన్నద్దం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలను మొదలు పెట్టాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్ను సైతం వైట్వాష్ చేయాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.