bihar pearl farmer earn lakhs employment migrant laborers covid 19 business success india
Business Idea : బీహార్లోని పాట్నా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు సాధారణంగా మొక్కజొన్న, పప్పులు, కందులు, తృణధాన్యాలు మరియు వరిని పండిస్తారు, ఆ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి వారందరికీ విభిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. చంపారన్ జిల్లా మురేరా గ్రామానికి చెందిన నితిల్ భరద్వాజ్ ముత్యాల సాగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. నితిల్ సంప్రదాయ రైతుల కుటుంబానికి చెందినవాడు. కానీ ఢిల్లీకి వెళ్లి ఒక బహుళజాతి కంపెనీలో కంప్యూటర్ ప్రొఫెషనల్గా పని చేశాడు. నెలకు దాదాపు రూ. 30,000 సంపాదించేవాడు.అదే సమయంలో, అతని తండ్రి ముత్యాల పెంపకం గురించి తెలుసుకుని అది ఎంత లాభదాయకమో కొడుకు నితిల్ భరద్వాజ్ కు వివరించాడు. ఇతర రైతులకు విభిన్నంగా సాగు చేస్తూ లక్షలు సంపాదించవచ్చని గ్రహించాడు. తండ్రి ఆలోచన నచ్చిన నితిల్ ముత్యాల పెంపకం గురించి శోధించడం మొదలు పెట్టాడు.
మధ్యప్రదేశ్లో బోమోరియా పెరల్ ఫామ్లో శిక్షణ తీసుకుని అక్కడే కొన్ని నెలలు పని చేసిమంచి అవగాహన పెంచుకున్నాడు. అవసరమైన నైపుణ్యాలను సంపాదించిన తర్వాత, అతను తన గ్రామంలో ముత్యాల పెంపకం ప్రారంభించడానికి తిరిగి వచ్చాడు. మొదటి ప్రయత్నంలోనే రిస్క్ ఫలించింది. అలాగే నితిన్ రూ.75,000 సంపాదించాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఆరుగురు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అతను ‘భరద్వాజ్ పెరల్ ఫామ్ అండ్ ట్రైనింగ్ సెంటర్’ని ప్రారంభించాడు.అతను 2019 లో, అతను చెరువులో 400 గుల్లలు నాటాడు. ఆదర్శంగా, ఒక ఎకరం చెరువులో 25,000 నుండి 30,000 గుల్లలు ఉంటాయి. కానీ తను చిన్నగా ప్రారంభించినట్లు తెలిపాడు నితిల్ భరద్వాజ్. రూ. 25,000 పెట్టుబడి పెట్టి, 8-10 నెలల పాటు గుల్లలు పండించాడు. దాని వల్ల అతనికి రూ.75,000 సంపాదించాడు.
bihar pearl farmer earn lakhs employment migrant laborers covid 19 business success india
ప్రతి ఓస్టెర్ పై దాదాపు రూ. 40 పెట్టుబడి పెట్టాలి. ఒక గుల్ల రెండు ముత్యాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ప్రతి ఒక్కటి సగటు ధర రూ. 120కి అమ్ముడు పోతుంది. గుల్లలు నెలల తరబడి సాగవుతాయి – ఇది వాటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాణ్యమైన ముత్యం రూ.200 పలుకుతుంది.2020లో అతను దాదాపు 25,000 ముత్యాలు నాటాడు. దాని నుండి అతను రూ. 30 లక్షలు సంపాదించాలని ఆశించాడు. అతను ఇప్పటివరకు రూ. 3.6 లక్షలు సంపాదించాడు. అదనంగా, నితిల్ ఆక్వాకల్చర్ ద్వారా చేపల సాగు కోసం చెరువును ఉపయోగిస్తున్నారు. గుల్లలకు హాని చేయని చేపలను పెంచుతున్నాడు. ఒక్క సీజన్లోనే చేపల వ్యాపారం ద్వారా రూ. 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు.
నితిల్ విజయం ఇతర రైతులనూ ఆకర్షించింది. వారూ ముత్యాల పెంపకం చేపట్టాలని అనుకుని నితిల్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ముత్యాల పెంపకం లాభదాయకంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ప్రక్రియలో శ్రద్ధ అవసరమని నితిల్ చెబుతున్నాడు. గుల్లల ఆరోగ్యాన్ని ప్రతి 15 రోజులకోసారి పర్యవేక్షించాలని ఆరోగ్యకరమైన ఆహారం మరియు పోషకాహారాన్ని అందించాలని చెబుతున్నాడు నితిల్.ప్రస్తుతం నిటిల్ ముంబై, ఢిల్లీ, కోల్కతాలోని వ్యాపారులకు ముత్యాలను విక్రయిస్తున్నాడు. వారు ఉత్పత్తిని చైనా మరియు జపాన్కు కూడా ఎగుమతి చేస్తారు. ముత్యాల సేద్యం వైపు మొగ్గు చూపడం పట్ల రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.