
bihar pearl farmer earn lakhs employment migrant laborers covid 19 business success india
Business Idea : బీహార్లోని పాట్నా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు సాధారణంగా మొక్కజొన్న, పప్పులు, కందులు, తృణధాన్యాలు మరియు వరిని పండిస్తారు, ఆ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి వారందరికీ విభిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. చంపారన్ జిల్లా మురేరా గ్రామానికి చెందిన నితిల్ భరద్వాజ్ ముత్యాల సాగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. నితిల్ సంప్రదాయ రైతుల కుటుంబానికి చెందినవాడు. కానీ ఢిల్లీకి వెళ్లి ఒక బహుళజాతి కంపెనీలో కంప్యూటర్ ప్రొఫెషనల్గా పని చేశాడు. నెలకు దాదాపు రూ. 30,000 సంపాదించేవాడు.అదే సమయంలో, అతని తండ్రి ముత్యాల పెంపకం గురించి తెలుసుకుని అది ఎంత లాభదాయకమో కొడుకు నితిల్ భరద్వాజ్ కు వివరించాడు. ఇతర రైతులకు విభిన్నంగా సాగు చేస్తూ లక్షలు సంపాదించవచ్చని గ్రహించాడు. తండ్రి ఆలోచన నచ్చిన నితిల్ ముత్యాల పెంపకం గురించి శోధించడం మొదలు పెట్టాడు.
మధ్యప్రదేశ్లో బోమోరియా పెరల్ ఫామ్లో శిక్షణ తీసుకుని అక్కడే కొన్ని నెలలు పని చేసిమంచి అవగాహన పెంచుకున్నాడు. అవసరమైన నైపుణ్యాలను సంపాదించిన తర్వాత, అతను తన గ్రామంలో ముత్యాల పెంపకం ప్రారంభించడానికి తిరిగి వచ్చాడు. మొదటి ప్రయత్నంలోనే రిస్క్ ఫలించింది. అలాగే నితిన్ రూ.75,000 సంపాదించాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఆరుగురు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అతను ‘భరద్వాజ్ పెరల్ ఫామ్ అండ్ ట్రైనింగ్ సెంటర్’ని ప్రారంభించాడు.అతను 2019 లో, అతను చెరువులో 400 గుల్లలు నాటాడు. ఆదర్శంగా, ఒక ఎకరం చెరువులో 25,000 నుండి 30,000 గుల్లలు ఉంటాయి. కానీ తను చిన్నగా ప్రారంభించినట్లు తెలిపాడు నితిల్ భరద్వాజ్. రూ. 25,000 పెట్టుబడి పెట్టి, 8-10 నెలల పాటు గుల్లలు పండించాడు. దాని వల్ల అతనికి రూ.75,000 సంపాదించాడు.
bihar pearl farmer earn lakhs employment migrant laborers covid 19 business success india
ప్రతి ఓస్టెర్ పై దాదాపు రూ. 40 పెట్టుబడి పెట్టాలి. ఒక గుల్ల రెండు ముత్యాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ప్రతి ఒక్కటి సగటు ధర రూ. 120కి అమ్ముడు పోతుంది. గుల్లలు నెలల తరబడి సాగవుతాయి – ఇది వాటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాణ్యమైన ముత్యం రూ.200 పలుకుతుంది.2020లో అతను దాదాపు 25,000 ముత్యాలు నాటాడు. దాని నుండి అతను రూ. 30 లక్షలు సంపాదించాలని ఆశించాడు. అతను ఇప్పటివరకు రూ. 3.6 లక్షలు సంపాదించాడు. అదనంగా, నితిల్ ఆక్వాకల్చర్ ద్వారా చేపల సాగు కోసం చెరువును ఉపయోగిస్తున్నారు. గుల్లలకు హాని చేయని చేపలను పెంచుతున్నాడు. ఒక్క సీజన్లోనే చేపల వ్యాపారం ద్వారా రూ. 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు.
నితిల్ విజయం ఇతర రైతులనూ ఆకర్షించింది. వారూ ముత్యాల పెంపకం చేపట్టాలని అనుకుని నితిల్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ముత్యాల పెంపకం లాభదాయకంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ప్రక్రియలో శ్రద్ధ అవసరమని నితిల్ చెబుతున్నాడు. గుల్లల ఆరోగ్యాన్ని ప్రతి 15 రోజులకోసారి పర్యవేక్షించాలని ఆరోగ్యకరమైన ఆహారం మరియు పోషకాహారాన్ని అందించాలని చెబుతున్నాడు నితిల్.ప్రస్తుతం నిటిల్ ముంబై, ఢిల్లీ, కోల్కతాలోని వ్యాపారులకు ముత్యాలను విక్రయిస్తున్నాడు. వారు ఉత్పత్తిని చైనా మరియు జపాన్కు కూడా ఎగుమతి చేస్తారు. ముత్యాల సేద్యం వైపు మొగ్గు చూపడం పట్ల రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Central Government : రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా రైతులకు సమగ్ర…
Russia : గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని ఆధిపత్యం చేస్తున్న అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని రష్యా…
Mad For Each Other Couple Show : బిగ్బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు…
Half-day schools : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభవార్త తెలియజేసింది.…
Pratyusha Death Case : టాలీవుడ్లో విషాదానికి ప్రతీకగా నిలిచిన నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం…
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై ఆధిపత్యం చాటింది. ఫిబ్రవరి 15న…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు…
Income Tax Rules : దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఫారమ్…
This website uses cookies.