
Brother Duo Earn Rs 3.5 Crore Year From Organic Veggies Charming Farm Stay
Business Idea : జీవితంలో జరిగే కొన్ని విషయాలు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అది చిన్న అంశమైనా సరే… దాని తాలూకు ప్రభావం మాత్రం గొప్పగా ఉంటుంది. అలాంటివి కొన్ని విజయతీరాలకు చేరుస్తాయి. మనం చేయాల్సిందల్లా ఆ అంశాన్ని మనకు అనుకూలంగా మలచుకుని ముందుకు సాగడమే. ఢిల్లీలోని జాత్ ఖోర్ కు చెందిన దాబాస్ కుటుంబానికి 2009లో అలాంటి ఒక సందర్భమే ఎదురైంది. మృణాల్, లక్షయ్ వాళ్ల అమ్మమ్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ ఘటన మృణాల్, లక్షయ్ కు ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజెప్పింది.పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పండిన ఆహారాన్ని ఆమెకు ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఆమె ఆరోగ్యాన్ని కాస్తంతా మెరుగుపరుస్తూ వచ్చింది. కిమో థెరపీ చేయించుకోవాల్సిన అవసరాన్ని తగ్గించింది. 2018లో మృణాల్, లక్షయ్ వాళ్ల అమ్మమ్మ మరణించినప్పటికీ…
ఆమెను అంతకాలం బతికేందుకు నాణ్యమైన ఆహారం అందించడమే కారణం. ఈ సందర్భం వారిద్దరు సోదరులను సేంద్రీయ పంటల సాగువైపు వెళ్లేలా చేసింది. సేంద్రీయ ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. కూరగాయలు మరియు భారీ ఉత్పత్తికి కృషి చేయడం ప్రారంభించారు.2013లో కూరగాయలు, గోధుమలు, కందులు, ఆవాలు, వరి, మినుములు మరియు పండ్ల పంటల ఉత్పత్తిని పెంచారు ఇద్దరు అన్నదమ్ములు. ఆర్గానిక్ ఎకర్ బ్రాండ్ క్రింద ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం, వారు ఢిల్లీలో దాదాపు 5,000 కుటుంబాలకు నాణ్యమైన కూరగాయలను అందిస్తున్నారు. పంట పండిన 12 గంటలలోపు తాజా ఉత్పత్తులను అందిస్తారు. వీటితో పాటు తమ పొలానికి వచ్చి సందర్శించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా సేంద్రీయ పంటలవైపు మళ్లేలా వర్క్షాప్లను కూడా నిర్వహిస్తారు.
Brother Duo Earn Rs 3.5 Crore Year From Organic Veggies Charming Farm Stay
ఈ వ్యాపారం ద్వారా వారికి ఏటా రూ.3.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది.సంవత్సరం మొత్తం పంట చేతికందేలా చూసుకున్నారు. కాలానికి అనుగుణమైన పంటల సాగు చేస్తున్నారు. దీని వల్ల పంట సెలవు అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పంట చేతికి వస్తుంది. దీని వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. అలాగే భూమిలో సారం కోల్పోకుండా ఉండేలా విభిన్నమైన పంటలను ఏకకాలంలోసాగు చేస్తున్నారు. దీనివల్ల భూమిలో పోషకాలు పెరుగుతాయి. కూరగాయల విక్రయాలతో నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు.ప్రాసెస్డ్ ఆహారాన్ని కూడా అందిస్తున్నారు అన్నదమ్ములు. పప్పులు మరియు గోధుమలతో చేసిన పిండిని కూడా మార్కెట్లో విక్రయిస్తారు.
అయితే ఆవాల సారంతో తయారు చేసిన నూనె మరియు కేక్లకు పరిశ్రమలో అధిక డిమాండ్ ఉంది. పశువులు పాలు మరియు దేశీ నెయ్యిని అందిస్తాయి. ఇవి వాటి ఆదాయాన్ని పెంచుతాయి. ఈ వ్యవసాయ క్షేత్రం తేనెటీగలను పెంచడంతోపాటు తేనెటీగల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునే వారి కోసం వర్క్షాప్లను నిర్వహిస్తుంది.సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పండించడమే కాకుండా, మార్కెటింగ్ మరియు అనుసంధానాలను సృష్టించడం సవాలుగా మారిందని వారు చెబుతున్నారు. సేంద్రీయ వ్యాపార నమూనాను ఏర్పాటు చేసిన తర్వాత, సోదరులు రైతులకు తమ మద్దతును అందించారు. సేంద్రీయ వ్యవసాయానికి మారాలనుకునే రైతులకు వ్యవసాయ క్షేత్రం వర్క్షాప్లు, శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహిస్తుందని లక్షయ్ చెప్పారు.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.