Business Idea : ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ ఏడాదికి రూ.3.5 కోట్లు సంపాదిస్తున్న అన్నదమ్ములు.. ఎక్కడో తెలుసా?

Business Idea : జీవితంలో జరిగే కొన్ని విషయాలు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అది చిన్న అంశమైనా సరే… దాని తాలూకు ప్రభావం మాత్రం గొప్పగా ఉంటుంది. అలాంటివి కొన్ని విజయతీరాలకు చేరుస్తాయి. మనం చేయాల్సిందల్లా ఆ అంశాన్ని మనకు అనుకూలంగా మలచుకుని ముందుకు సాగడమే. ఢిల్లీలోని జాత్ ఖోర్ కు చెందిన దాబాస్ కుటుంబానికి 2009లో అలాంటి ఒక సందర్భమే ఎదురైంది. మృణాల్, లక్షయ్ వాళ్ల అమ్మమ్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ ఘటన మృణాల్, లక్షయ్ కు ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజెప్పింది.పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పండిన ఆహారాన్ని ఆమెకు ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఆమె ఆరోగ్యాన్ని కాస్తంతా మెరుగుపరుస్తూ వచ్చింది. కిమో థెరపీ చేయించుకోవాల్సిన అవసరాన్ని తగ్గించింది. 2018లో మృణాల్, లక్షయ్ వాళ్ల అమ్మమ్మ మరణించినప్పటికీ…

ఆమెను అంతకాలం బతికేందుకు నాణ్యమైన ఆహారం అందించడమే కారణం. ఈ సందర్భం వారిద్దరు సోదరులను సేంద్రీయ పంటల సాగువైపు వెళ్లేలా చేసింది. సేంద్రీయ ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. కూరగాయలు మరియు భారీ ఉత్పత్తికి కృషి చేయడం ప్రారంభించారు.2013లో కూరగాయలు, గోధుమలు, కందులు, ఆవాలు, వరి, మినుములు మరియు పండ్ల పంటల ఉత్పత్తిని పెంచారు ఇద్దరు అన్నదమ్ములు. ఆర్గానిక్ ఎకర్ బ్రాండ్ క్రింద ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం, వారు ఢిల్లీలో దాదాపు 5,000 కుటుంబాలకు నాణ్యమైన కూరగాయలను అందిస్తున్నారు. పంట పండిన 12 గంటలలోపు తాజా ఉత్పత్తులను అందిస్తారు. వీటితో పాటు తమ పొలానికి వచ్చి సందర్శించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా సేంద్రీయ పంటలవైపు మళ్లేలా వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు.

Brother Duo Earn Rs 3.5 Crore Year From Organic Veggies Charming Farm Stay

ఈ వ్యాపారం ద్వారా వారికి ఏటా రూ.3.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది.సంవత్సరం మొత్తం పంట చేతికందేలా చూసుకున్నారు. కాలానికి అనుగుణమైన పంటల సాగు చేస్తున్నారు. దీని వల్ల పంట సెలవు అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పంట చేతికి వస్తుంది. దీని వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. అలాగే భూమిలో సారం కోల్పోకుండా ఉండేలా విభిన్నమైన పంటలను ఏకకాలంలోసాగు చేస్తున్నారు. దీనివల్ల భూమిలో పోషకాలు పెరుగుతాయి. కూరగాయల విక్రయాలతో నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు.ప్రాసెస్డ్ ఆహారాన్ని కూడా అందిస్తున్నారు అన్నదమ్ములు. పప్పులు మరియు గోధుమలతో చేసిన పిండిని కూడా మార్కెట్‌లో విక్రయిస్తారు.

అయితే ఆవాల సారంతో తయారు చేసిన నూనె మరియు కేక్‌లకు పరిశ్రమలో అధిక డిమాండ్ ఉంది. పశువులు పాలు మరియు దేశీ నెయ్యిని అందిస్తాయి. ఇవి వాటి ఆదాయాన్ని పెంచుతాయి. ఈ వ్యవసాయ క్షేత్రం తేనెటీగలను పెంచడంతోపాటు తేనెటీగల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది.సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పండించడమే కాకుండా, మార్కెటింగ్ మరియు అనుసంధానాలను సృష్టించడం సవాలుగా మారిందని వారు చెబుతున్నారు. సేంద్రీయ వ్యాపార నమూనాను ఏర్పాటు చేసిన తర్వాత, సోదరులు రైతులకు తమ మద్దతును అందించారు. సేంద్రీయ వ్యవసాయానికి మారాలనుకునే రైతులకు వ్యవసాయ క్షేత్రం వర్క్‌షాప్‌లు, శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహిస్తుందని లక్షయ్ చెప్పారు.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

5 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

8 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

11 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

13 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

16 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

18 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago