Business Idea : చాలామంది వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించాలి. అనుకుంటూ ఉంటారు. కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ వాటిలో లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది వ్యాపారం పెట్టుకోవాలి, అనుకుంటారు కానీ వారికి డబ్బు అందుబాటులో ఉండదు. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే చదువుకునే ఉద్యోగుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కొందరు, వారు కూడా ఏదో ఒక వ్యాపారం అన్న చేయాలి. డబ్బులు సంపాదించాలి. అని అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఆరోగ్యం సరిగా లేక బయటికి వెళ్లి పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని వ్యాపారాలకు ,అస్సలు మార్కెట్లో డిమాండ్ అంటూ, ఉండదు. ఇలా ఆ రకరకాల కారణాలతో వ్యాపారాలలో సమస్యలు ఉంటాయి. అయితే జనాలలో మంచి గిరాకీ ఉన్న బిజినెస్, మంచి లాభాలు వచ్చే బిజినెస్, ఒక ప్లాన్ తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ గ్రామాల నుండి సిటీల వరకు బాగా గిరాకీ ఉంటుంది.
దేశంలో కరోనా మహమ్మారి కారణంగా అందరూ హెల్త్ పై బాగా శ్రద్ధను పెట్టారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం కోసం, ధనం ఖర్చు పెడుతున్నారు. పోషక ఆహార పిండి బిజినెస్ పెడితే, చాలా బాగా లాభాలు వస్తాయని అంటున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం, ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో మీరు మొదలు పెట్టవచ్చు. దీనికి నెల నెల భారీగా లాభాలు ను అందుకుంటారు. ఈ పోషక ఆహార పిండి శరీరానికి రోగనిరోధ శక్తిని అందిస్తుంది. అలాగే కొందరు ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఆ వ్యాధులను ఎదుర్కొనే శక్తి ,ఈ పిండిలో ఉంటుంది అంటున్నారు. అలాగే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పిండితో చేసే ప్రతి వంట కూడా చాలా రుచిగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది. ఈ పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం.. దీనికి గోధుమలను తీసుకొచ్చి వాటిని ముందుగా 12 గంటల పాటు నానబెట్టి తరువాత అవి కాస్త మొలకెత్తి దశకు రాగానే వాటిని నీటి నుంచి వేరుచేసి నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టాలి. తరువాత వీటిని పిండిగా ఆడించాలి.
700 గ్రాముల ఈ గోధుమ పిండిలో 50 గ్రాముల మునగ ఆకుల పొడిని, అలాగే 100 గ్రాముల కందిపొడిని, అదేవిధంగా 50 గ్రాముల మెంతిపిండి 25 గ్రాముల అశ్వగంధ పొడి, 25 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ గోధుమ పిండిలో ఇవన్నీ కలిపితే అదే పోషక ఆహార పిండి అవుతుంది. దీనికి ఒక కిలో పిండి తయారు చేయడానికి 30 నుంచి 35 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే మార్కెటింగ్ కోసం ఇంకొక ఐదు రూపాయలు ఖర్చవుతాయి దీనిని హోల్సేల్ మార్కెట్లో 50 రూపాయలకు రిటైల్ మార్కెట్లో రూ 60 కి అమ్ముకోవచ్చు. ఇలా కిలో పిండి పై పది రూపాయల లాభం వస్తుంది. ఇలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి నెలకి 50 వేల రూపాయల ఆదాయంను పొందవచ్చు. ఈ పిండిని తయారీ కోసం ముందుగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ మైసూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ ఫ్రెన్యూర్ మేనేజ్మెంట్ కుండలి నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ వ్యాపారం కోసం చట్టబద్ధంగా అనుమతులన్నీ తీసుకొని మొదలుపెట్టాలి. లేదు అంటే కొన్ని సమస్యలు ఎదురవల్సి వస్తుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.