Today Gold Price : నిన్నటి వరకు ఊరించిన బంగారం ధర.. ఈరోజు హడలెత్తించింది..!
Today Gold Price : గత వారం రోజులుగా తగ్గుదల కనిపించిన బంగారం ధరలు (Gold Price) ఈరోజు ఊహించని విధంగా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడికి 10 గ్రాములకు రూ.1,200 పెరిగి తాజాగా రూ.95,130కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,100 పెరిగి 10 గ్రాములకు రూ.87,200 వద్ద కొనసాగుతోంది. పెరుగుతున్న అంతర్జాతీయ బులియన్ మార్కెట్, డాలర్ మారక రేటు ప్రభావం, ఆభరణాలపై డిమాండ్ పెరగడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Today Gold Price : నిన్నటి వరకు ఊరించిన బంగారం ధర.. ఈరోజు హడలెత్తించింది..!
ఇక వెండి విషయానికి వస్తే.. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద స్థిరంగా ఉంది. గత కొన్ని రోజులుగా వెండి ధరలు స్థిరంగా ఉండటం వినియోగదారులకు కొంత ఊరట కలిగించినా, బంగారం ధరలు ఇలా ఊహించని రీతిలో పెరగడం మళ్లీ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మున్ముందు పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం కొనుగోలు చేసే వారి ఖర్చు మరింతగా పెరిగే అవకాశముంది.
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో కూడా బంగారం ధరలు సమానంగా నమోదయ్యాయి. హైదరాబాద్లో లాగానే విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, నల్గొండ వంటి నగరాల్లోనూ ఈ ధరలే అమలులో ఉన్నాయి. వినియోగదారులు ప్రస్తుతం బంగారం కొనుగోలుపై పునరాలోచిస్తున్నా, దీర్ఘకాలిక పెట్టుబడిగా పసిడిని కోరుకునే వారు మాత్రం తక్కువ మొత్తాల్లో అయినా కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…
POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…
Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…
Pakiza : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్గా…
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్తో…
Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…
This website uses cookies.