Categories: BusinessExclusiveNews

Union Minister Piyush Goyal : ఈఎఫ్‌టీఏతో భారత్‌ కీలక ఒప్పందం .. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Union Minister Piyush Goyal  : ఢిల్లి: ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 100 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం భారత్‌-ఈఎఫ్‌టీఏలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఇందులో సరకు వాణిజ్యం, మేధఓ సంపత్తి హక్కులు, సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, ప్రభుత్వ సేకరణ, సాంకేతిక అడ్డంకులను తొలగించుకోవడం వంటి 14 అంశాలున్నాయి. దాంతోపాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు నిబంధనల్ని సడలించాల్సి ఉంటుంది. న్యాయమైన, సమానత్వంతో కూడిన వాణిజ్యానికి ఈ ఒప్పందం నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐర్లాండ్‌, లైక్టన్‌స్టైన్‌, నార్వే, ఫిన్లాండ్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటి వరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఈఎఫ్‌టీఏ దేశాలకు భారత్‌ ఎగుమతులు 2021-2022లో 174 బిలియన్‌ డాలర్లుగా ఉండేవి. 2022-23 నాటికి అవి 1.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక ఆదేశాల నుంచి దిగుమతులు 25.5 బిలియన్‌ డాలర్ల నుంచి 16.74 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

Union Minister Piyush Goyal  పెట్టుబడులు.. ఉద్యోగాలు..

ఈ ఒప్పందం ద్వారా ఈఎఫ్‌టీఏ దేశాలు ఒక ప్రధాన వృద్ధి మార్కెట్‌కు యాక్సెస్‌ను పొందుతాయి. మన కంపెనీలు తమ సరఫరా గొలుసులను మరింత స్థితిస్థాపకంగా అందించడానికి ప్రయత్నిస్తాయి. ప్రతిఫలంగా, ఈఎఫ్‌టీఏ నుంచి భారత్‌ మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తద్వారా ఉద్యోగాల పెరుగుదలకు దారి తీస్తుంది. మొత్తం మీద, ఈ ఒప్పందం ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది అని ఈఎఫ్‌టీఏ సభ్య దేశాల తరపున ఫెడరల్‌ కౌన్సిలర్‌ గై పార్మెలిన్‌ అన్నారు.

Union Minister Piyush Goyal  ఏమిటీ స్వేచ్ఛా వాణిజ్యం..

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రకారం, ఇద్దరు వ్యాపార భాగస్వాములు తమ మధ్య వర్తకంలో గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడంతోపాటు, సేవలు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని ప్రోత్స#హంచడానికి నిబంధనలను సడలిస్తాయి. ఈ ప్రక్రియను అధికారికంగా వాణిజ్యం-ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అని పిలుస్తారు. నవంబర్‌ 2013లో చర్చలు ఆగిపోయే ముందు వరకు 2008 జనవరి నుంచి మొత్తం పదమూడు రౌండ్లు చర్చలు జరిగాయి. అక్టోబరు 2023లో ఇరుపక్షాలు చర్చలను పున:ప్రారంభించి, ఫాస్ట్‌ ట్రాక్‌ మోడ్‌లో ముగించాయి.

Union Minister Piyush Goyal  కొత్త మలుపు: ప్రధాని

ఐరోపా సమాఖ్యలోని నాలుగు దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలకమైన కొత్త మలుపుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. భారత్‌-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన, దీనిపై సంతకాలు చేసిన వారికి శుభాకాంక్షలు. గత పదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి ఫార్మా, వైద్యపరికరాలు, శుద్ధిచేసిన ఆహార పదార్థాలు, పారిశ్రామిక వస్తువుల రంగంలో పెనుమార్పులకు ఈ ఒప్పందం సహకరిస్తుంది. యుతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఈ ఒప్పందం ఎంతో సహకరిస్తుందని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం మొదటి పదేళ్లలో 50 బిలియన్‌ డాలర్లు, తదుపరి ఐదేళ్లలో మరో 50 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడులుగా పెడతారు. తద్వారా 10 లక్షలమందికి ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. భారత్‌ను ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే మా తదుపరి లక్ష్యం అని ప్రధాని తెలిపారు.

Recent Posts

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

13 minutes ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

9 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

10 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

11 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

12 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

14 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago