Categories: BusinessExclusiveNews

Union Minister Piyush Goyal : ఈఎఫ్‌టీఏతో భారత్‌ కీలక ఒప్పందం .. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Advertisement
Advertisement

Union Minister Piyush Goyal  : ఢిల్లి: ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 100 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం భారత్‌-ఈఎఫ్‌టీఏలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఇందులో సరకు వాణిజ్యం, మేధఓ సంపత్తి హక్కులు, సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, ప్రభుత్వ సేకరణ, సాంకేతిక అడ్డంకులను తొలగించుకోవడం వంటి 14 అంశాలున్నాయి. దాంతోపాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు నిబంధనల్ని సడలించాల్సి ఉంటుంది. న్యాయమైన, సమానత్వంతో కూడిన వాణిజ్యానికి ఈ ఒప్పందం నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐర్లాండ్‌, లైక్టన్‌స్టైన్‌, నార్వే, ఫిన్లాండ్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటి వరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఈఎఫ్‌టీఏ దేశాలకు భారత్‌ ఎగుమతులు 2021-2022లో 174 బిలియన్‌ డాలర్లుగా ఉండేవి. 2022-23 నాటికి అవి 1.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక ఆదేశాల నుంచి దిగుమతులు 25.5 బిలియన్‌ డాలర్ల నుంచి 16.74 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

Advertisement

Union Minister Piyush Goyal  పెట్టుబడులు.. ఉద్యోగాలు..

ఈ ఒప్పందం ద్వారా ఈఎఫ్‌టీఏ దేశాలు ఒక ప్రధాన వృద్ధి మార్కెట్‌కు యాక్సెస్‌ను పొందుతాయి. మన కంపెనీలు తమ సరఫరా గొలుసులను మరింత స్థితిస్థాపకంగా అందించడానికి ప్రయత్నిస్తాయి. ప్రతిఫలంగా, ఈఎఫ్‌టీఏ నుంచి భారత్‌ మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తద్వారా ఉద్యోగాల పెరుగుదలకు దారి తీస్తుంది. మొత్తం మీద, ఈ ఒప్పందం ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది అని ఈఎఫ్‌టీఏ సభ్య దేశాల తరపున ఫెడరల్‌ కౌన్సిలర్‌ గై పార్మెలిన్‌ అన్నారు.

Advertisement

Union Minister Piyush Goyal  ఏమిటీ స్వేచ్ఛా వాణిజ్యం..

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రకారం, ఇద్దరు వ్యాపార భాగస్వాములు తమ మధ్య వర్తకంలో గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడంతోపాటు, సేవలు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని ప్రోత్స#హంచడానికి నిబంధనలను సడలిస్తాయి. ఈ ప్రక్రియను అధికారికంగా వాణిజ్యం-ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అని పిలుస్తారు. నవంబర్‌ 2013లో చర్చలు ఆగిపోయే ముందు వరకు 2008 జనవరి నుంచి మొత్తం పదమూడు రౌండ్లు చర్చలు జరిగాయి. అక్టోబరు 2023లో ఇరుపక్షాలు చర్చలను పున:ప్రారంభించి, ఫాస్ట్‌ ట్రాక్‌ మోడ్‌లో ముగించాయి.

Union Minister Piyush Goyal  కొత్త మలుపు: ప్రధాని

ఐరోపా సమాఖ్యలోని నాలుగు దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలకమైన కొత్త మలుపుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. భారత్‌-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన, దీనిపై సంతకాలు చేసిన వారికి శుభాకాంక్షలు. గత పదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి ఫార్మా, వైద్యపరికరాలు, శుద్ధిచేసిన ఆహార పదార్థాలు, పారిశ్రామిక వస్తువుల రంగంలో పెనుమార్పులకు ఈ ఒప్పందం సహకరిస్తుంది. యుతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఈ ఒప్పందం ఎంతో సహకరిస్తుందని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం మొదటి పదేళ్లలో 50 బిలియన్‌ డాలర్లు, తదుపరి ఐదేళ్లలో మరో 50 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడులుగా పెడతారు. తద్వారా 10 లక్షలమందికి ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. భారత్‌ను ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే మా తదుపరి లక్ష్యం అని ప్రధాని తెలిపారు.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

5 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.