Home » Devotional » A Miracle Happened While Rama Was Carving His Eyes In Telugu
Devotional

రాముడు కళ్ళు చెక్కేటప్పుడు అద్భుతం జరిగింది.. అసలు నమ్మలేకపోయా..!!

Authored By
aruna
The Telugu News | Published on: January 27, 2024, 12:00 pm
Advertisement

అయోధ్య రాముడు విగ్రహాన్ని చెక్కిన అరుణ్యోగి రాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.రామున్ని ప్రతిష్టించిన సమయంలో చూస్తే అసలు ఆ విగ్రహాన్ని చెక్కింది నేనేనా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు. అలంకరణ తర్వాత అంతా ఆ రామయ్య విగ్రహానికి అంత అందంగా వస్తుందని ఊహించలేదని అన్నాడు. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఏదో తెలియని అందం అందులోకి వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేశారు.. అలంకరణ తర్వాత రామయ్య స్వరూపమే మారిపోయింది. చెక్కుతున్న సమయంలోనే ఒక్కో దశలో ఒక్కో విధంగా కనిపించింది. కానీ ఆభరణాలతో అలంకరించిన తర్వాతే మొత్తం రూపురేఖలు మారిపోయాయి.నిజానికి ప్రాణ ప్రతిష్టకి ముందు బాలరాజు ఫోటోలు ఈ విషయంలో కాస్త వివాదం తలెత్తినప్పటికీ రాముడు ముఖం చూసినవాళ్లంతా తన్మయత్వంతో మునిగిపోయారు. ఎంత బాగుందో అని శిల్పిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా కళ్ళు, పెదాలని చాలా శ్రద్ధతో చెక్కాడని ప్రశంసిస్తున్నారు.

Advertisement

దీనిపైనే అరుణ్ణి ప్రశ్నిస్తే అంతా రాముడి దయ ఆయన ఆదేశించాడు.. నేను చెప్పుకుంటూ వెళ్లిపోయాను అంతే అని నవ్వుతూ సమాధానం ఇస్తున్నాడు. ఈ విగ్రహాన్ని తయారు చేసింది దాదాపు 7 నెలలో శ్రమించినట్లు చెప్పాడు. 7 నెలల సమయం తనకి ఓ సవాలుగా మారిందని వివరించాడు. శిల్పస్తా శిల్పశాస్త్రానికి తగ్గట్టుగా జరగడంతో పాటు ఐదేళ్ల రాముడిగా కనిపించేలా చెక్కటం ఛాలెంజింగ్ అనిపించింది అని చెప్పాడు. బాల రాముడు విగ్రహం చెక్కిన సమయంలో ఆయన కళ్ళను గురించి నాకు కాస్త భయం ఉండేది. అందుకే కళ్ళు బాగున్నాయా అని మా ఫ్రెండ్స్ ని పదేపదే అడిగాను. బాల రాముని రూపాన్ని చెక్కడం నా అదృష్టం అని చెప్తున్నాడు. రామ్ లాల్ అలా ఓ భావాన్ని తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు.దాని కోసం చాలా సమయం వెచ్చించాలి. అందుకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉంటారు గమనించి అదే పసితనం రాముడికి విగ్రహం లో కనిపించేలా చూసుకున్నాను. ఇదంతా రాముడి దయతోనే జరిగింది. ఇదంతా రాముడు దయతోనే జరిగింది. సంతోషంగా ఉందని చెప్తున్నాడు. నిజానికి ప్రాణ ప్రతిష్టకి ముందు రామ్ లాల్ విగ్రహ ఫోటోలు బయటకు వచ్చాయి.. కానీ 22 తారీకు ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత తెర తొలగించారు.

అప్పుడు ఈ తొలిదర్శనమిచ్చాడు. అయోధ్య రాముడు సోషల్ మీడియా అంతటా ఫోటోలు చాలా అందంగా కళ్ళను మరియు పెదాలను చెక్కావ్ అని నన్ను అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పోస్ట్ అని చూసి ఎమోషనల్ అయ్యాడు అరుణ్యోగి రాజ్.. ప్రస్తుత ఈ భూమి మీద అందరికన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా.. అంటే అది నేను, నా కుటుంబ సభ్యుల ముందు తరాల వారు ఆశీస్సులతో పాటు రామయ్య ఆశీర్వాదాలు నాపై ఉన్నాయి. నాకు ఇంకా ఇది నమ్మడం లేదు. కల్లోగాని ఉన్నట్లు అనిపిస్తుంది.అని అని అన్నాడు అరుణ్ రాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి