Ramzan : రంజాన్ మాసాన్ని ముస్లింలు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరోజైనా సరే ఉపవాసం చేస్తుంటారు. పేద, ధనిక అనే బేధం లేకుండా తమకు ఉన్నంతలో ఉపవాస ప్రక్రియను పూర్తి చేస్తారు. రంజాన్ ఉపవాసం ఘోరమైన, కఠిన నిష్టలు, నియమాలతో కూడి ఉంటుంది. ఎంత కష్టమైనా సరే ముస్లింలు ఈ ఉపవాసం చేసేందుకే మొగ్గు చూపిస్తారు. ఈ ఉపవాస సమయంలో ఉపవాసం ఉన్న వారు తినేందుకు ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఉపవాసం చేసిన వారు కేవలం ఆ సమయంలో మాత్రమే నీటిని తాగాలి మరియు ఆహారం తీసుకోవాలి.
చాలా మంది పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి, ఉండీ డైరెక్టుగా టైం కాగానే ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. కానీ అది అంత మంచి పద్ధతి కాదని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.రంజాన్ ఉపవాస సమయంలో ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ డీ హైడ్రేట్ కు గురవుతారు. కావున ఉపవాస సమయం పూర్తికాగానే మొదటగా మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. అలా కాకుండా డైరెక్టుగా ఆహార పదార్థాలు తింటే గ్యాస్ సమస్య వేధించే ప్రమాదం ఉంది.
కనీసం లీటర్ లేదా లీటర్ నర నీటిని తీసుకోవడం చాలా అవసరం. ఒకేసారి నీరు తాగడం ఇబ్బందిగా ఉంటే ఓ పది నిమిషాల సమయం తీసుకొనైనా నీటిని తాగడం చాలా అవసరం. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి తినే ఆహారంలో ఎక్కువగా కారం లేని ఆహారం తీసుకోవాలి. రెండు పుల్కాలు, రెండు రకాల కూరలు ప్రిఫర్ చేయాలి. నెల రోజుల పాటు ఇలా పాటించడం వలన శరీరంలో ఉండే కొవ్వు మొత్తం తగ్గుతుంది. డీటాక్సిఫికేషన్ అవుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏవైనా ఉంటే కంట్రోల్ అవుతాయి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.