Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా.... వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులైన దేవుళ్ళ విగ్రహాలలో తప్పులు చేసిన ఆ ప్రభావం ఇంటిలో ఉంటుంది. దీనివల్ల ప్రతికూల శక్తులు ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది అంటే ఎంతో పవిత్రమైన స్థలం. స్థలంలో దేవతా విగ్రహాలను పెట్టి పూజించడం శుభప్రదం. అయితే కొన్ని దేవతలు దేవుళ్లకు సంబంధించిన చిత్రపటాలు పెట్టుకోవడం అశుభంకరం. ఏ రకమైన దేవుళ్ల విగ్రహాలను లేదా పటాలను మీ పూజ గదిలో పెట్టుకోకూడదు వివరంగా తెలుసుకుందాం.
Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా…. వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది…?
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఎంతో పవిత్రమైనది. ఎప్పుడూ కూడా పూజ గది శుభ్రంగా ఉండాలి. అంతే కాదు, కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. చాలామంది తెలిసి తెలియక పూజ గదిలో ఇలాంటి దేవుళ్లను లేదా దేవతల విగ్రహాలను పెట్టే విషయాలలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శుద్ధి వస్తుందని నమ్ముతారు. లేకుంటే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దానివల్ల మీ ఇంట్లో సమస్యలను సృష్టిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పూజ స్థలం చాలా పవిత్రమైనది. మందిరం ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో శ్రీకృష్ణుడు,రాధా రాణి విగ్రహాలను కలిపి ఉంచడం శుభప్రదం. మరికొన్ని దేవుళ్ళ విగ్రహాలను కలిపి ఉంచడం వల్ల అశుభానికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. ఏ దేవతల విగ్రహాలను, మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలతో కలిపి ఉంచకూడదు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం విష్ణువు శివలింగానికి కలిపి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే రెండిటిని పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది.విష్ణువు శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాలు కంటే ఎక్కువ అశుభ ఫలితాలు కలుగుతాయి. పొరపాటున అయినా కూడా పూజ గదిలో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల విగ్రహాలను కలిపి ఉంచవద్దు. త్రిమూర్తులు ఉన్న ఫోటోలు కూడా పెట్టుకోవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఇంకా,కాళికాదేవి శనీశ్వరుడు రాహువు, కేతు వంటి పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు.ఎందుకంటే, ఈ దేవతలందరూ ఉగ్ర స్వరూపాన్ని కలిగి ఉంటారు.వీరికి ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా పూజిస్తారు.అంతేకాదు, ఆగ్రహంతో ఉండే అమ్మవారి విగ్రహం లేదా, ఉగ్రరూపంలో ఉన్న దేవత విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు. సానుకూల శక్తి కోసం విగ్రహాలను సంతోషకరమైన ఆశీర్వదించిన మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Hibiscus Plant Vastu Tips | భారతీయ సంప్రదాయంలో మొక్కలు, పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజల్లో, వాస్తులో, ఆరోగ్య…
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
This website uses cookies.