Home » Devotional » Karthika Masam Lo Kumbh Rashi Phalithalu In Telugu
Devotional

kumbh Rashi : కార్తీక పౌర్ణమి నుండి కుంభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు అన్ని ఇన్ని కాదు…!

Authored By
aruna
The Telugu News | Published on: November 21, 2023, 12:00 pm
Advertisement

kumbh Rashi : కార్తీక పౌర్ణమి నుండి కుంభ రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల వరకు రాళ్లు వేసిన వారే మీపై పూలవర్షం కురిపిస్తారు. భగవంతుడే శాసించారు. కార్తీక పౌర్ణమి నుండి ఈ రాశి వారికి అద్భుత రాజయోగం పట్టబోతుంది. అయితే కార్తీక పౌర్ణమి నుండి కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరు సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం… ఈ రాశి వారు ఇప్పటివరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. కుటుంబ పరంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు పిల్లలకు ఆరోగ్యం బాగా లేక పోవడం, అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒత్తిడి వివాహంలో సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడ్డారు. కానీ కార్తీక పౌర్ణమి నుండి ఈ రాశి వారి యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటివరకు పడ్డ మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాలు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు.

Advertisement

ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో ఎన్నో సిరిసంపదలను భోగభాగ్యాలను తీసుకువస్తుంది. వివాహపరంగా కావచ్చు.. ఉద్యోగ పరంగా కావచ్చు.. ఎంత సంపాదించినప్పటికీ సంపద కనిపించలేని వారికి ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసినప్పటికీ అప్పుల భారం ఎక్కువై బాధపడే వారికి ఇలా అన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి కార్తీక పౌర్ణమి నుండి ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఈ కార్తీక పౌర్ణమి వీరు జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా చెప్పవచ్చు. అంటే మీరు ఎంతో కాలంగా ఎన్నో రకాల ఆఫీస్లు చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఎలాంటి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు కోరుకున్న ఆఫీసులో మీరు కోరుకున్న పదవీ లభిస్తుంది. అంతేకాకుండా ఎంతోకాలంగా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ దొరుకుతుంది. అది కూడా మీకు నచ్చిన ప్రదేశానికి మీ కుటుంబంతో పాటు వెళ్లి ఉండగలిగే విధంగా ఉంటుంది. ఆఫీసులో మీపై అధికారలా నుంచి ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీ అమితమైన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు ఆర్థిక మెరుగుదల కనిపిస్తుంది. డబ్బులు వివిధ రకాలుగా ఖర్చు చేసినప్పటికీ కూడా ఎన్నో రకాల ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.

సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తులసి కోటకు దీపం పెట్టి నమస్కరించాలి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుని ఓం నమశ్శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పటించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిసరాలు గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో వారు కార్తీక పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవడం వలన సర్ప దోషాలన్నీ తొలగిపోయి సకాలంలో సత్సంతానం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో సోమవారం రోజు ప్రదోషకాలంలో ఉసిరికాయ దీపం పెట్టడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి