Devotional News : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఒక్కో గుడికి వెళ్లినప్పుడు ఒక్కో విధంగా నడుచుకుంటాం. మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఏ దేవుడికి పూజ ఎలా చేయాలి.. ఏ దేవుడికి ఏం ఇష్టం, అక్కడ నడుచుకోవాల్సిన విధి విధానాల గురించి తెల్సుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే శివుడి గుడికి వెళ్తే అభిషేకం, హనుమంతుడి గుడికి వెళ్తే సింధూరం పెట్టించి ప్రత్యేక పూజ చేయించడం.. గ్రామ దేవతలు అయితే కోళ్లు, మేకలు బలి ఇస్తూ ఇలా వివిధ రకాలుగా దేవుళ్లను కొలుస్తుంటాం. కానీ శివుడి గుడికి వెళ్లినప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు మన పెద్దలు. అందుకు కారణం… శివాలయంలో ఉండే శివ లింగానికి, నందీశ్వరుడికి మధ్య మనుషులు నడవకూడదు కాబట్టి.
మనం చూసుకోకుండా వెళ్లినా, లేదా తెలిసి వెళ్లినా మనకు మంచి జరగదని చెబుతుంటారు. అందుకే మనం శివాలయానికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. అయితే అసలు నిజంగానే అలా నడకూడదా నడిస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన పురాణ గాథల ప్రకారం ఏజయర్ద్వియోర్మధ్యే నంది శంకర యోరపి అనే ప్రమాణం ఉంది. అంటే మేక పోతుల మధ్య, ద్విజుల మధ్య, నంది శంకరుల మధ్య నడవరాదని అర్థం. ఆ పురాణాల ప్రకారమే మన పెద్దలు నంది, శివ లింగాల మధ్య నడవకూడదని చెబుతారు. అయితే శివుడు భక్తాను గ్రహ తత్పరుడు. అలాగే నందీశ్వరుడు శివ భక్తుల్లో అగ్ర గణ్యుడు. అంటే శివుడిని ఆరాధించడంలో నందీశ్వరుడి తర్వాతే మిగతా వారంతా.
ఆ ప్రేమతోనే ఆ భోళా శంకరుడికి వాహనంగా మారాడు నందీశ్వరుడు. శివుడి పాద పద్మాలను ఎడ తెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు గూడా అవిశ్ఛినంగా భక్తాగ్ర గణ్యుడైన నందీశ్వరుని అనుగ్రహ దృష్టిని ప్రసరింప జేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్ఛేదం ఏర్పడుతుంది. అలా జరిగితే వారిపై వీరిద్దరికి కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా జరిగితే ఏదైనా శాపం పెడ్తుంటారని మన పెద్దలు చెబుతుంటారు. గుడికి వెళ్లినపు వచ్చే పుణ్యం కంటే వారిద్దరికి కోపం తెప్పించి శాప గ్రస్తులు అవడం కంటే… శివ లింగానికి, నందీశ్వరుల మధ్య నడవ కూడదని చెప్తుంటారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.