why should the temple gopuram be built high
Devotional News : దేవాలయం అంటే లక్షోపలక్షల భక్తుల పుణ్యధామం. ఆగమ శాస్త్ర బద్ధంగా దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. అయితే ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయన రీతిలో నిమిస్తారు. ఆలయ గోపురమే భగవంతుని పాదాలు. గర్భగుడి భగవంతుని శిరస్సు అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆలయం మంటపం భగవంతుడి కడుపు. దైవ దర్శనం అంటే గుడిలోకి వెళ్లి స్వామిని చూసి గంట కొట్టి నమస్కరించాలి అనుకుంటుంటాం. ఆ పద్ధతినే పాటిస్తుంటాం. కానీ దూరంగా ఉండి కూడా ఆలయ గోపురానికి నమస్కరించినా స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి. అంతే కాకుండా దేవాలయం ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించి ఉండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణించబడుతూ… పోషింప బడుతూ, రక్షింప బడుతూ, దర్శింప బడుతూ ఉండాలి.
దాతలు ఎవరైనా దేవాలయానికి దానిధికాలు చేయొచ్చు. అలాగే పోషకులుగా కూడా ఉండొచ్చు. వేశ్యలు కూడా దేవాలయాలను కట్టించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సర్వ జనానికానికి, పొరుగు వారికి, పరదేశ వాసులకు, కొత్తగా వచ్చిన వారికి దేవాలయం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవడానికి ఆలయం గోపురం ఎంతో ఉపయోగ పడుతుంది. వేరే గ్రామాల్లో ఉన్న ఆలయాలను చూసేందుకు వెళ్లేటప్పుడు సమయం మించిపోయి ఆలయం మూసి వేస్తే.. దూరం నుంచే గోపురానికి దండం పెట్టుకోవచ్చు. ఆ తర్వాతి రోజు వెళ్లి దేడివికి నమస్కారం చేసుకోవచ్చు. అందుకే ఆలయ గోపురాన్ని ఊరి చివరన ఉన్నా కనిపించేలా నిర్మిస్తుంటారు.దేవాలయ గోపురమే కాదు ఆలయం కూడా ఎత్తు మీద ఉండటం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.
why should the temple gopuram be built high
అందుకే చాలా వరకు దేవాలయాలు కొండలు, గుట్టల మీద ఉంటాయి. ఎందుకంటే మానవుడు ఎంతటి తెలివకలవాడైనా ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేడు. వరద బీభత్సాలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవల్సిందే. అటువంటి ప్రకృతి ప్రళయ సమయంలో ప్రాణులను కాపాడ గల్గిన స్థలం దేవాలయమే. దేవుడ సర్వోన్నతుడు. ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతీసారి… అందరికీ బోధపడేలా చేసేందుకే గోపురాన్ని వీలయినంత ఎత్తుగా నిర్మిస్తుంటారు. హిందు దేవాలయాలే కాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం(మినార్) నిర్మిస్తారు. చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.