Acharya : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్రం దారుణంగా నిరాశపరచింది. ఈ చిత్రం వల్ల బయ్యర్లకు భారీగా నష్టపోయారు. దీంతో నష్టపోయిన వారికి సెటిల్ చేయాల్సి వచ్చింది. అయితే ‘ఆచార్య’ సినిమా బిజినెస్ మరియు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకున్న కొరటాలే నష్టపరిహారం చెల్లించే బాధ్యత తీసుకున్నారని ప్రచారం జరిగింది. సినిమాకు నష్టమొస్తే నిర్మాతలు భరించాలి కానీ..
మొత్తం దర్శకుడి మీదే భారం మోపడం ఎంతవరకు సమంజసమని కామెంట్స్ చేసారు.అయితే ‘ఆచార్య’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి – రామ్ చరణ్ – కొరటాల రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత స్వయంగా చెప్పారు. పారితోషికం తీసుకోకుండానే మెగా తండ్రీకొడుకులు ఇద్దరూ దాదాపు 175 రోజులు పనిచేశారని తెలుస్తోంది. అందుకుగానూ బ్యానర్ పేరు వేసుకుని ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకొని ఉండొచ్చని అందరూ భావించారు.
చేతి ఖర్చుల కోసం మాత్రమే కొంత తీసుకున్నామని కొరటాల సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇప్పుడు నష్టాలు రావడంతో అందరూ దర్శకుడి వెంట పడుతున్నారని అంటున్నారు. కాకపోతే ఈ సెటిల్ మెంట్ విషయంలో చిరు – చరణ్ ఎందుకు కలుగజేసుకోలేదనే దానిపైనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి ‘ఆచార్య’ హీరోలిద్దరూ తమ బాధ్యతగా తిరిగి చెల్లింపులు చేశారని సమాచారం. చిరంజీవి – రామ్ చరణ్ కలిసి దాదాపు రూ.25 కోట్లు తిరిగి ఇచ్చారట. ఈ మొత్తం నుంచే చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసారని టాక్ వినిపిస్తోంది. ‘వినయ విధేయ రామ’ సినిమా టైంలో రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.