Kamalini Mukherjee : టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. తమ అందం నటనతో ప్రేక్షకులను అలరించి కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోతారు. కానీ ఇప్పటికి వాళ్ళు ప్రేక్షకుల మనసులో మెదులుతూ ఉంటారు. వారి ఖాతాలో ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన వాళ్లు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతారు. ఒక్కసారి అలాంటి హీరోయిన్స్ ని చూస్తే ఓ ఈ హీరోయిన్ ఆ సినిమాలో బాగా నటించింది అని గుర్తుచేసుకుంటారు. అలాంటి హీరోయిన్స్లలో ఒకరు కమలిని ముఖర్జీ.
తెలుగు పరిశ్రమలోకి ‘ ఆనంద్ ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కమలిని ముఖర్జీ. శేఖర్ కమ్ముల దర్శకత్వ వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకు కూడా వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఆనంద్ సినిమా హిట్ తర్వాత గమ్యం, మీనాక్షి, గోదావరి, క్లాస్ మేట్స్, హ్యాపీడేస్, జల్సా, గోపి గోపిక గోదావరి, రామాచారి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చివరిగా రామ్ చరణ్ ‘ గోవిందుడు అందరివాడేలే ‘ సినిమాలో నటించింది.
ఆ తర్వాత ఇక ఏ సినిమాలోను నటించలేదు. ఎక్కడ కనిపించలేదు కూడా. అయితే ప్రస్తుతం కమలిని ముఖర్జీ అమెరికాలో స్థిరపడిందని సమాచారం. బిజినెస్ రంగంలో బిజీగా గడుపుతున్నట్లు టాక్. ఈమధ్య డల్లాస్ లో జరిగిన ఓ వేడుకల్లో కమలిని ముఖర్జీ కనిపించారు. కొంచెం బొద్దుగా అయిపోయారు. బ్లూ డ్రెస్ వేసుకొని అందరిని మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ అసలు ఈమె కమలిని ముఖర్జీనేనా అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంచెం బొద్దుగా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.