Samantha : సమంత రోగం గురించి తెలిసిన దాదాపు 15 రోజుల తరవాత ఈరోజు స్పందించిన అక్కినేని అమల !

Authored By Rame Samhith | The Telugu News | Updated on : 10 November 2022, 12:20 pm

Samantha : సమంత అన్ హెల్తీ నెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టైం లో సమంతకు తమ సపోర్ట్ అందించాలని అనుకుంటున్నారు సెలబ్రిటీస్. ఇప్పటికే సమంత తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి చెప్పగానే అందరు ఆమె త్వరగా కోలుకోవాలని స్పందించారు. ఇక లేటెస్ట్ గా సమంత గురించి అక్కినేని అమల కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తెలుసుకున్న అమల అక్కినేని చాలా బాధపడ్డారట. అక్కినేని ఫ్యామిలీకి దూరమైనా సరే సమంత అంటే అమలకి అభిమానం ఉంది.

అందుకే సమంత అనారోగ్యం గురించి తెలుసుకుని ఆమె సన్నిహితులతో మాట్లాడినట్టు టాక్. అంతేకాదు సమంత త్వరగా కోలుకోవాలని అమల కూడా అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా వచ్చిన సమంత 3 ఏళ్లకే ఆ ఫ్యామిలీతో తన బంధాన్ని తెగదెంపులు చేసుకుని వచ్చేసింది. ఇప్పుడు సమంత అన్ హెల్తీ నెస్ వల్ల మళ్లీ అక్కినేని ఫ్యామిలీకి దగ్గరవుతున్నట్టు తెలుస్తుంది. సమంత కు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తెలిసిన నాగ చైతన్య కూడ చాలా బాధపడినట్టు తెలుస్తుంది. పర్సనల్ గా సమంతతో ఫోన్ లో కూడా మాట్లాడాడట చైతన్య.

after 15 days amala respond about samantha health issue

after 15 days amala respond about samantha health issue

సమంత అనారోగ్యం గురించి 15 రోజుల ముందే తెలుపగా రెండు వారాలకు అమల స్పందించడం పై కూడా రకరకాల వార్తలు రాస్తున్నారు. సమంత మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. అంతేకాదు యశోద సినిమా ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసింది సమంత. సినిమా పట్ల సమంతకు ఉన్న డెడికేషన్ కి ఆమెని సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సమంత లీడ్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. హరి హరీష్ దర్శకులిద్దరు కలిసి యశోదని తెరకెక్కించారు. సమంత ఈ సినిమాలో తన అల్ రౌండర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుందని అంటున్నారు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp