Akhil Akkineni : అఖిల్ ని విలేఖరి ఆ ప్రశ్న అడగగానే పిచ్చ బీపీ వచ్చింది !
Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి సరైన హిట్ అఖిల అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. డాన్స్ మరియు ఫైట్స్ పరంగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఇప్పటివరకు అఖిల్ కి సరైన సినిమా పడలేదు. ఇలాంటి తరుణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” అనే సినిమా… సరిగ్గా అఖిల్ కి సూట్ అయ్యే రీతిలో వస్తూ ఉంది. ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అయితే సినిమా విడుదల కావటానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో భారీ ఎత్తున ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి.
ప్రారంభంలో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేయాలని అనుకున్న చివరిలో తెలుగులోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అఖిల్ పాల్గొన్న ప్రతీ సారి షూటింగ్ డిలే , ఓవర్ బడ్జెట్ అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. దీంతో కొంత అసహనానికి లోనవుతున్నాడు. వెళ్లిన ప్రతిచోట నెగిటివ్ ప్రశ్నలు ఎదురు కావటంతో… ఊహించని ఆన్సర్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ విలేఖరి ఈ రకంగానే అడగటంతో పిచ్చ బీపీ వచ్చి మండిపోయేటట్టు అఖిల్ సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంతకీ ప్రశ్న ఏమిటంటే.. సినిమా చాలా సందర్భాలలో ఆగిపోవలసి వచ్చింది. ఎందుకు ఇంత ఆలస్యంగా విడుదలవుతుంది అని విలేకరి ప్రశ్నించాడు.
Akhil Akkineni was asked that question by the reporter BP got mad
ఈ ప్రశ్నకి అఖిల్… ఆలస్యమని అనద్దు. ఈ సినిమా షూటింగ్ కోసం కేవలం 105 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది. నిజానికి ఈ సినిమా చాలా కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అవన్నీ చెప్పలేక అఖిల్ ఇలా కవర్ చేసుకునే పరిస్థితి నెలకొంది. మరోపక్క ఏజెంట్ ప్రమోషన్ కార్యక్రమాలకు ప్రభాస్ అదేవిధంగా చరణ్ వస్తున్నట్లు వార్తలపై విలేకరులు ప్రశ్నించారు. ఆ వార్తలలో వాస్తవం లేదని… ట్రైలర్ చూసి పర్సనల్ గా ఫోన్ చేసి ఇద్దరు మెచ్చుకున్నట్లు అఖిల్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో నాగార్జున వందో సినిమా ప్రస్తావన రాగా స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదు. మా కాంబో సినిమా అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా… ఉండాలని అలా ఉంటేనే చేస్తామని.. అఖిల్ సమాధానం ఇవ్వడం జరిగింది.
